దాగుడు మూతలు...(పూర్తి నవల)

 

                                                                   దాగుడు మూతలు                                                                                                                                                      (పూర్తి నవల)

జీవితమే ఒక దాగుడుమూతల ఆట. 'ప్రేమ' కూడా ఆ ఆటలో ఒక భాగమే.

జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనం దాగుడుమూతల ఆట ఆడుంటాముజీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది. జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నా లేకున్నాఆడుతూ పాడుతూ జీవించాల్సిందేమనము ఆటలోని భాగమే.

విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవలేకపోవడం, కోరిన వస్తువులను పొందలేకపోవడం, చెయ్యాలనుకున్న ఉద్యోగం చేయలేకపోవడంజీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత.

యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముత ఆటే .

మధ్య వయస్కుడు తాను ఊహించిన  శైలిలో బ్రతకలేక పోవడం .. జీవితం మనతో ఆడే దాగుడుమూతే.

వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాకవారి మధ్య వుంటూమధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడాజీవితం మనతో ఆడుకునే దాగుడుముత ఆటలోని భాగమే.

జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితం మనతొ ఆడే ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, పెద్దలు చెప్పే అనుభావాలను చక్కగా అమలుపరిచి ఆడితే.. గెలుపు మనదే…..

'ప్రేమ 'కూడా జీవితంలో ఒక భాగమే. కానీ 'ప్రేమ' మాత్రం జీవితం అడే దాగుడుమూతల ఆటను జయించి, కావలసిన వారిని చేరుకుంటుంది...ఏలా? పూర్తి నవలను చదివితే మీరే ఆశ్చర్యపోతారు.

************************************************PART-1**********************************************

సంవత్సరం: 1955

చోటు: హైదరాబాద్.

ప్రియమైన దేవుడా... మంచి సమయంలో, ఇక్కడున్న అందర్నీ నీ బంగారు చేతులలో పెడుతున్నాను. మీరు మా జీవితంలో ఎంత మంచివారుగా ఉన్నారో, ఎలాగైతే మా పాపాలన్నిటినీ మన్నించారో...అదేలాగా ఇక్కడున్న ఒక్కొక్క వ్యక్తి కుటుంబంలోనూ, జీవితంలోనూ ప్రవేశించి, వాళ్ళ పాపాలను మన్నించి ఆశీర్వదించు. వాళ్ళను శాపాల నుండి, వ్యాధులు-అనారోగ్యం నుండి, మానసిక పోరాటాల నుండి వాళ్ళకు విముక్తి ప్రసాదించి, వాళ్ళకు సుఖాలాను అందించు!”

పాతకాలం నాటి క్రైస్తవ దేవాలయంలో ప్రొద్దుటి పూట ప్రార్ధన జరుగుతున్నది. ప్రార్ధన చేస్తున్న వారు సిస్టర్ అమీలియా. విరామం లేకుండా దైవ కార్యాలలో ఆమె చేస్తున్న సేవల వలన ఆమె మొహంలో ఒక తేజస్సు, ప్రశాంతత కనిపిస్తోంది. చూసేవాళ్ళందరూ చేతులెత్తి నమస్కరించే -- దైవీక మొహం ఆమెది.

ఆమె ఎదురుకుండా ఉన్న కుర్చీలలో, దేవుని దగ్గర పలు కోర్కెలను ముందుంచి, జనం కూర్చోనున్నారు. మతాలు ఏదైనా ప్రశాంతతను వెతుక్కుని తిరుగుతున్న మనసులు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలు!

అక్కడున్న వారినందరినీ వరుసగా చూస్తూ వస్తే చివరి వరుసకు ముందు వరుసలో ఐదవ వ్యక్తిగా కూర్చోనున్నది మన కథా నాయకి ప్రశాంతి.

క్యారట్ రంగులో చిన్న చిన్న పసుపు చుక్కలు పెట్టిన కొత్తగా కొనుక్కున్నచీర, దానికి మ్యాచింగ్ గా పసుపు రంగు బార్డర్ వేసిన జాకెట్టు వేసుకోనున్నది. పొడుగైన జడే అందం అని అనుకుంటున్న వారందరి ఆలొచన ఆమె యొక్క ఒత్తుగానూ, చిన్నదిగానూ ఉన్న జుట్టును చూస్తే మారిపోతుంది. అందంగా కట్ చేయబడ్డ జుట్టుతో, రెండు జడలు వేసుకుని నల్ల రంగు రబ్బర్ బ్యాండును చుట్టుకోనుంది.    

ప్రశాంతి యొక్క ఎత్తు తక్కువని, ఆమె వేసుకున్న హీల్స్ వేసుకున్న చెప్పులే   చెబుతాయి. రేగి పండు రంగుతో, బాణం ఆకారంలో దిద్దుకున్న కురులు, గుండ్రంగా ఉన్న మొహం, ఆహా...అందులో అందమైన తిలకం బొట్టు క్రింద, నుదుటిపైన ఉన్న తల వెంట్రుకల దగ్గర ఉన్న కుంకుమ, ‘ఈమె ఇక్కడ ఏం చేస్తున్నది?’ అనే ప్రశ్నను మిగిలిన వారి మనసులలో ఏర్పరిచింది. ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో అశాంతి నిండిపోయున్నది.  

అవును! ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమె మొహం రోజు కొంచం వాడిపోయే ఉంది. చూసిన వెంటనే ఈమె మంచిదా...లేక చెడ్డదా అని లెక్క వేయలేని వ్యత్యాసమైన ముఖ అమరిక.  

కారణం. మన ప్రశాంతి మంచివారికి మంచిది...చెడ్డవారికి చెడ్డది. గంభీరంగానూ, పట్టుదలగానూ, శాంతంగానూ ఉంటూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.  

ప్రార్ధన ముగియగానే, ఆఫీసుకు వెళ్ళిన ప్రశాంతి సిస్టర్ అమీలియా ను కలుసుకోవాలని సెక్యూరిటీ దగ్గర చెప్పి పంపి కాచుకోనున్నది. ఆమె కాలేజీ మాజీ విధ్యార్ధిని మాత్రమే కాదు...అక్కడ పనిచేస్తున్న వాళ్ళకూ పరిచయస్తురాలు. అందువలన తెలిసిన వారందరూ ఆమెతో మర్యాదగా నడుచుకుంటారు.  

అమ్మగారూ, కొంచం ఆలశ్యం అయ్యేటట్టు తెలుస్తోంది. బయటకు ఎక్కడకైనా వెళ్ళాలంటే వెళ్ళి ఒక గంట తరువాత రండి?” అని ఎంతో వినయంగా చెప్పాడు సెక్యూరిటీ.

ఇంకొంచం వివరంగా రేపు జరపాల్సిన ప్రార్ధన గురించి, లారన్స్ ఫాదర్ తో మాట్లాడుతున్నారమ్మా. ఆయనతో పాటూ చాలా మంది ఉన్నారమ్మా. అందుకనే... అంటూ తల గోక్కున్నాడు.

పరవాలేదు. నేను మన కాలేజీ అంతా ఒక చుట్టు చుట్టొస్తా. టైము సరిపోతుంది. చాలా రోజులైంది అటువైపు వెళ్ళి... అంటూ బయలుదేరింది ప్రశాంతి.

కాలేజీ సెలవులు అనేది తెలిసేటట్టుగా ఖాలీగా ఉన్న ప్లే గ్రౌండ్, కాకుల కచేరీ గుర్తు చేస్తోంది. ఎర్రటి రాలిపోయిన పూవులు పడిన సిమెంటు బెంచ్ మీద కూర్చున్న ఆమె, మెల్ల మెల్లగా తన కాలేజీ జ్ఞాపకాలలో మునిగిపోయింది.

హైదరాబాద్ లో పేరు పొందిన కాలేజీ, అది.కో-ఎడ్యుకేషన్ అయినా, చాలా కఠినమైన నిబంధనల కాలేజీ అని పేరు తెచ్చుకుంది. అందువలన నగరంలోని ఉన్నత సంపాదన గల ప్రజలు పోటా పోటీ వేసుకుంటూ తమ పిల్లల్ని కాలేజీలో చేర్చటానికి ఇష్టపడతారు. బాగా చదువుకునే మధ్య తరగతి సంతతికీ కూడా అక్కడ స్వాగతం ఉంది.

రోజా, రోజు మీ సినిమా హాలులో ఏం సినిమా ఆడుతోందే?”

అనార్కలి. మన వేదాంతం రాఘవయ్య గారి సినిమా. మిస్ చేయకండే. నేనూ, మా అక్కయ్య ఆదివారమే పట్టుదల పట్టి వెళ్ళి చూసొచ్చాము

దానికి తరువాత వెళదాం. ఇప్పుడు శ్రీ 420హిందీ సినిమాకు వెళ్దామే. చెక్కిన శిల్పంలా ఉన్నదట హీరోయిన్ నర్గీస్. పోయిన సారి వచ్చినప్పుడే చూడలేకపోయాము

సినిమాకి టికెట్టు దొరకటం చాలా కష్టమే. మన క్లాసులోని మగ పిల్లలందరూ అక్కడికే దండయాత్ర చేశారు. నర్గీస్ కోసమే పలు సార్లు చూసే రకం వాళ్ళు

ప్లీజ్ జానకీ, రోజే మనకు టైము దొరికింది. టికెట్లకు మీ అన్నయ్య శంకర్ ను పట్టుకో. నన్ను ఎలాగైనా సినిమాకు తీసుకు వెళ్ళు. సినిమా అయిన తరువాత మీ అందరికీ ఐస్ క్రీం కొనిస్తాను

నా వల్ల కాదే! ప్రొద్దున వాడి దగ్గర అడిగి బాగా తిట్లు తిన్నాను

ఇప్పుడు ఏం చేద్దామే?”  

ఆలొచిస్తూ ఒకరి మొహం ఒకరు చూస్తున్న స్నేహితుల బృందం కళ్ళకు తెల్ల రంగు కలిగిన సొగసు కారులో నుండి దిగుతున్న యుక్త వయసు యువతి ప్రశాంతి కళ్ళల్లో పడింది.

మనం అడిగితే మగ పిల్లలు టికెట్లు కొని ఇవ్వరు. అడిగే వాళ్ళు అడిగితే దొరుకుతుంది. ఇప్పుడు చూడు అని చెప్పిన జానకి,

హాయ్ ప్రశాంతి...గుడ్ మార్నింగ్. రోజు క్లాసులు లేవు! నీకు ఫోన్ చేసి చెబుదామనే బయలుదేరుతున్నాం. ఇంతలో నువ్వే వచ్చాశావు

అలాగా...సరే పరవాలేదు. లైబ్రరీ కి వెళ్ళాల్సిన పని ఉంది. పరీక్షలకు తయారవ్వాలి

"ఇలా చూడవే, సినిమాలలో దీని లాంటి డబ్బు గల అమ్మాయలు, కాలేజీ ఎగొట్టి ఊరంతా తిరుగుతారు. మధ్య తరగతి అమ్మాయలు ఉద్యోగాలకు వెళ్ళాలని పడీ పడీ చదువుతారు. ఇక్కడేమిట్రా అంటే...అంతా తలకిందలుగా ఉంది. ప్రశాంతీ, రోజుతో లైబ్రరీ ఏమీ మూసేయటం లేదు. అందుకని రోజు మాతోపాటూ శ్రీ 420సినిమాకు వస్తున్నావు

రామయ్యా వస్తావయ్యా అంటూ అందమైన గొంతుకతో ఆమె పాడగా, ఆమెతో ఉన్న మిగిలిన స్నేహితురాళ్ళు కోరస్ పాడారు.

నా వల్ల కాదు బాబూ. రోజు నాకు గుర్రపు స్వారి ట్రయినింగ్ ఉంది

సరే, రోజు మా అన్నయ్య, తన స్నేహితుడూ మీ బావ శ్రీనివాస్ కలిసి సినిమాకు వెడుతున్నట్టు చెప్పాడు. నీకు వద్దంటే నువ్వు రావద్దు

ప్రశాంతి యొక్క మెరుస్తున్న కళ్ళను చూస్తూనే చెప్పింది జానకి.

లేదే...నా కోసం ప్రత్యేకంగా ఒక స్త్రీ వచ్చి చెప్పిస్తోంది. అందువల్లే క్లాసు ఎగోట్టాలంటే అదొలా ఉంది

కథలు చెప్పకు. కానీ, ఒక విషయం. ఇది ఇప్పుడే వేసిన హఠాత్ ప్లాను. అందువలన డబ్బులు మేమిస్తాము. టికెట్లు మాత్రం నువ్వు కొనివ్వాలి

ప్రశాంతికి డబ్బులు ఒక లెక్క కాదు. ఇది తెలిసే అలా మాట్లాడింది.

డబ్బులే కదా. వడ్డీతో కలిపి ఇంకో పది సంవత్సరాల తరువాత తీసుకుంటా అని నవ్వుతూ చెప్పి, అటుపక్కగా నడిచి వెడుతున్న ఒక అబ్బాయిని పిలిచింది.

ప్రభూ...ఇక్కడికి రావా. మేము శ్రీ 420సినిమా చూడటానికి టికెట్లు కొనివ్వగలవా?”

అతను ప్రశాంతి తనని పిలిచి మాట్లాడటాన్ని నమ్మలేకపోయాడు. ఆనందంతో ఖచ్చితంగా ప్రశాంతీ. మేము అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు ఉన్నాయి. మీరు చూడండి. మేము రేపు చూసుకుంటాం అని దారాల ప్రభువులాగా తన జేబులో ఉన్న టికెట్లను దానం చేశాడు.

టికెట్లు తీసుకుని, దానికి ఇవ్వాల్సిన డబ్బుకు రెట్టింపు డబ్బు అతని చేతిలో పెట్టి, స్నేహితులతో గలగలమని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది.

జరుగుతున్నదంతా గమనిస్తున్న వివేక్, “ప్రభూ నీ స్టేటస్ కు ఎక్కువ ఆశపడకూడదు. ఇంతకు ముందే వేరే ఒకతను, ఆమె పుట్టిన దగ్గర నుండే కాచుకోనున్నాడని విన్నాను

ఛీ...ఛీ...ఎందుకురా నీ బుద్ది ఇంత నీచంగా ఆలొచిస్తోంది? సినిమా టికెట్టు ఇచ్చి ట్రాప్ చేయగలమారా ఆమెను? ప్రశాంతీ అడిగితే, సినిమా హాలునే వాళ్ళ నాన్న కొనేసి, రోజూ, ప్రశాంతీకి నచ్చిన సినిమా వేస్తారు. నా స్టేటస్ కు అందులో ఒక మేనేజర్ ఉద్యోగం, ఆమె రెకమండేషన్ తో దొరికితే చాలు. మా కుటుంబమే బ్రతికేస్తుంది

ఇలా తన తోటి విధ్యార్ధినీ/విధ్యార్ధులు ఎవరికీ దొరకదు అని మాట్లాడబడిన ప్రశాంతీ, సినిమాలో రాజ్ కపూర్ ను చూసి ఆనందించక, చీకటిలో దూరంగా కనబడుతున్న తన బావ శ్రీనివాస్ ను చూసి ఆనందిస్తూ ఉన్నది.

************************************************PART-2**********************************************

కాలేజీ జ్ఞాపకాలు చెదిరిపోయి--ప్రస్థుత కాలానికి వచ్చిన ప్రశాంతి, సమయం ఎక్కువ అయినట్లు గ్రహించి తిరిగి చర్చ్ ఆఫీసుకు వెళ్ళింది. అంతకు ముందే సిస్టర్అమీలియా తో మాట్లాడుతున్న వ్యక్తులు వెళ్ళిపోగా...ఆమె, మరొకరు మాత్రమే ఆఫీసు రూములో ఉన్నారు. అనుమతి తీసుకుని లోపలకు వెళ్ళిన ప్రశాంతిని కూర్చోమన్నట్టు చెప్పింది సిస్టర్అమీలియా. 

ఫాదర్...నేను చెప్పాను చూడండి, రాజా మార్తాండ్ చక్రవర్తి గారి అమ్మాయని, ఆమే ఈమె...పేరు ప్రశాంతి. మన కాలేజీ మాజీ విధ్యార్ధిని. చాలా తెలివిగలది

ప్రశాంతీ, ఈయనే ఫాదర్ లారన్స్. బుధవారం జరుగబోయే ప్రత్యేక ప్రార్ధనకోసం భీమవరం నుండి వచ్చారు -- పరస్పరం ఇద్దరినీ పరిచయం చేసింది.

నమస్తేఅంటూ చేతులు జోడించిన ప్రశాంతితో.

మీ నాన్న గురించి చాలా విన్నాను. భీమవరం లోని మా చర్చుకు కావలసిన స్థలాన్ని కొనడానికి కూడా సహాయపడ్డారు. నిన్ను కలుసుకోవటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. దేవున్ని చేరుకున్న ఆత్మలకోసం బుధవారం జరపబోయే ప్రార్ధనలో నువ్వు పాల్గొంటే నేను ఇంకా సంతోష పడతానుఅన్నారు ఫాదర్ లారన్స్.

తటపటాయిస్తూనే నవ్విన ప్రశాంతి క్షమించండి ఫాధర్’... రోజు రాత్రి నేను ఊరికి బయలుదేరుతున్నా. పిల్లల్ని స్కూల్లో చేర్పించటం గురించి మాట్లాడేసి, తరువాత మా ఇంటిని చూసి రావాలి. ఇంకోసారి తప్పకుండా పాల్గొంటా ఫాధర్ అన్నది.

అవును ఫాదర్’. ప్రశాంతి ముఖ్యమైన పనిమీద ఊరికి వెళ్తోంది. రోజు కూడా నేనడిగేనని ప్రార్ధనలో పాల్గొంది. ఆమెకు కుదిరితే తప్పకుండా వస్తుంది. విషయంలో అచ్చు ఆమె తండ్రిలాగానే నడుచుకుంటుంది... అని ఫాదర్ లారన్స్ తో ప్రశాంతి పరిస్థితిని వివరంగా చెప్పింది. తరువాత ఆవిడ, తన చేతిలో ఉన్న కవర్ను ప్రశాంతికి అందించింది.  

"ఇదిగోమ్మా...నువ్వు అడిగిన లెటర్. మీ నాన్నగారి పేరు చెప్పే నువ్వు సీటు సంపాదించి ఉండవచ్చే! అక్కడున్న రెండు స్కూళ్ళూ, మీ నాన్నగారు దానంగా ఇచ్చిన స్థలంలోనే జరుగుతున్నాయి

ఉండనివ్వండి సిస్టర్. మా నాన్న గారి పేరును ఉపయోగించుకోవటం నాకు ఇష్టం లేదు! నేను ఆయన కూతుర్నని అక్కడ ఉన్న ఎవరికీ తెలియకూడదు. అది, ప్రశాంతతను వెతుక్కుంటూ వెడుతున్న నాకు, మరింత వేదన పెడుతుంది. మీరూ చెప్పకండి...ప్లీజ్...నా కోసం...

సరేమ్మా...అలాగే కానిద్దాం. కానీ, సంవత్సరం నువ్వు చెప్పినట్లే నీ పిల్లలకు  ఇంట్లోనే చదువు చెప్పించు. వచ్చే సంవత్సరం నుండి వాళ్ళను రోజూ స్కూలుకు వెళ్ళనివ్వు. నీ ఇంట్లోనే ఉండి చదువు చెప్పించే నమ్మకమైన ఒక టీచర్ను కోడైకానల్లో ఏర్పాటు చేశాను. ఆమే వంటకు, తోట పనికి, మిగిలిన ఇంటి పనులుకు, చిల్లర పనులకు మనుషులను ఏర్పాటు చేసి ఇస్తుంది. నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు?”

రోజే. నేను మాత్రమే బయలుదేరి వెళ్తున్నాను. స్కూలు పని ముగించుకుని, ఇంటికి  వెళ్ళి, ఇల్లు శుభ్రం చేసుకుని, కొంచంగా వంట సామాను కొనిపడేసి, తరువాత పిల్లల్ని తీసుకుని వెళ్దామనుకుంటున్నా సిస్టర్. అందువల్ల, వచ్చే వారం వాళ్ళను వచ్చి నన్ను ఇంట్లోనే కలుసుకోమని చెబితే వసతిగా ఉంటుంది. కొన్ని రోజులే ఇల్లు......స్కూలు తెరిచిన వెంటనే, స్కూలు పక్కనే ఇల్లు తీసుకుని అక్కడికి నివాసం మార్చుకుందామని అనుకుంటున్నా. పనిలోకి వచ్చే వాళ్ళందరూ మా ఇంట్లోనే స్టే చేస్తే నాకు వసతిగా ఉంటుంది

రాబోవు ఆపద గురించి తెలియకుండా చెప్పింది.

ఖచ్చితంగా చెబుతానమ్మా

గందరగోళంలో ఉన్న ప్రశాంతి ధ్యాంక్స్ చెప్పటం మరిచి పోవటాన్ని గుర్తుకు తెచ్చుకుని, తనని తానే తిట్టుకుని మీ సహాయానికి చాలా థ్యాంక్స్ సిస్టర్అన్నది చిన్నగా.

ఎక్కడైనా బిడ్డ తల్లికి థ్యాంక్స్ చెబుతుందా? నేను చదివిన చదువు మీ నాన్న నాకు పెట్టిన బిక్ష. ఆయన కూతురైన నీకు సహాయపడి ఆయన రుణాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నీకు ఏం కావాలన్నా నా దగ్గర అడగొచ్చు. సరేనా...?” అని తల్లిలాగా సిస్టర్ చెప్పిన మాటలకు కళ్ళు చెమెర్చినై ప్రశాంతికి

ఆఫీసు గదిలో ఒకచోట తగిలించున్న ఒక ఫోటోలో తన తండ్రి గంభీరంగా నిలబడుంటం ఆమె మనసును మరింత కరిగించింది.

ఊరంతటికీ మంచి వారుగా ఉన్న మీరు, ఎలా మీ అల్లుడికి మాత్రం విల్లన్ లా కనబడుతున్నారు?’ అని మనసులోనే వెయ్యి సార్లు అయినా ప్రశ్నించుకుంది.

ఊహూ...అంటూ గొంతు సవరించుకున్నారు ఫాదర్ లారన్స్.

 ప్రశాంతీ, నువ్విప్పుడు ఊరికి వెళ్ళే కావాలా? ఇక్కడే నీకు కావలసిన సహాయం మేము చేస్తామమ్మా. తప్పుగా తీసుకోకు...చెప్పాలనిపించింది, చెప్పేశాను

చాలా థ్యాంక్స్ ఫాదర్. మీరూ తప్పుగా తీసుకోకండి. నేను ఇక్కడ ఉండలేని పరిస్థితి. అందుకనే పుట్టి, పెరిగిన ఊరిని వదిలేసి, నేను ఎవరనేది తెలియని ఊరికి వెళ్తున్నాను. చూద్దాం, ఇంకా కొన్ని రోజుల్లో పరిస్థితులు సరి అవుతాయి అని నమ్ముతున్నా

బాధపడకమ్మా. భగవంతుడు నీ భర్తను తొందరగా  నీ దగ్గరకు తీసుకు వచ్చి చేరుస్తాడు. నువ్వు ఇదివరకు లాగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండబోతావు చూడు అన్నది అమీలియా.

సరే...నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు. ఇక నిన్ను అడ్డుపడి ఆపడం కష్టం. నా కోసం ఒక సహాయం చేస్తావా? గొలుసును ఎప్పుడూ నీతోనే ఉంచుకుంటావా?" అంటూ తన మెడలో ఉన్న ఒక గొలుసును తీసి ప్రశాంతికి ఇచ్చిన ఫాదర్ లారన్స్ ను ఆశ్చర్యంతో చూసింది అమీలియా.

పునీత శక్తి కలిగిన గొలుసును ఆయన ఎప్పుడూ తన మెడలో నుండి తీసిందే లేదు. ఇప్పుడు గొలుసును ప్రశాంతి దగ్గర ఇస్తున్నారంటే, ఆమెకు గొలుసు యొక్క అవసరం ఎంతో ఉందని గ్రహించింది అమీలియా. సమయంలో అమీలియా మన్సులో ఏదైనా తప్పు జరగబోతోందా?’ అనే ప్రశ్న వచ్చి కూర్చుంది. 

వాళ్ళ మనసులను అర్ధం చేసుకోని ప్రశాంతి ఖచ్చితంగా ఫాదర్...సరి నేనొస్తాను అని చెప్పి బయలుదేరింది.

ఆమె వెళ్ళిపోయిన వెంటనే గొణిగారు ఫాదర్ లారన్స్.

నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి...అదే ఇక మీదట నా ముఖ్యమైన ప్రార్ధన

************************************************PART-3**********************************************

హైదరాబాద్ నుండి బయలుదేరిన తెల్ల రంగు కారు, కనీసమైన వేగంతో గుంటూరు దాటి వెళ్తోంది. ముందు రోజు రైల్లో వెళ్దామని రిజర్వేషన్ చేసుకున్న ప్రశాంతిని ఆపి కారులో పంపించింది ఆమె స్నేహితురాలు పద్మ.

స్నేహితురాలి కారులో, తనకు నమ్మకమైన డ్రైవర్ తోడుతో బయలుదేరటం వలన భయం లేకుండా ప్రయాణం చేసింది ప్రశాంతి. దేవుని మీద భక్తి ఎక్కువగా లేకపోయినా, కళ్ళకు కనబడుతున్న గుడిని చూసి దన్నం పెట్టుకుంది. ఆ అలవాటు కూడా ఆమెకు ఆమె తండ్రి దగ్గర నుండి వచ్చిన అలవాటే.  

అప్పుడు ఆమెకు ఒకరోజు తన తండ్రితో దేవుని గురించి జరిగిన చర్చ జ్ఞాపకం వచ్చింది.  

నాన్నా...నీకు దేవుడి మీద నమ్మకం లేదే! మరలాంటప్పుడు ఎందుకు చర్చ్ కు డబ్బులు ఇచ్చారు, గుడి కుంభాభిషేకానికి నాయకత్వం వహించి జరిపారు? మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతున్నాను నాన్నా?’

నన్ను చెబుతున్నావే, ‘రహీంఅంకుల్ కూడా మన గుడిలో అన్నదానం చేసేటప్పుడు తన వంతుగా డబ్బులు ఇచ్చాడు. తరువాత సిస్టర్ అమీలియా చేసే సేవలు నాకు బాగా నచ్చాయి. మన పూర్వీకులు రాజులుగా ఉన్నప్పుడు చేస్తూ వస్తున్న పేదలకు ఉచితంగా చదువు చెప్పే పనిని ఇప్పుడు ఈమె చేస్తోంది. అందుకోసం సిస్టర్ అమీలియాకు కావలసింది చేశాను. నీ రెండో ప్రశ్నకు సమాధానం, గుడి నిర్వాహాన్ని మన వారసత్వం నిర్వాహం చేస్తూ వస్తోంది. నా ముత్తాత కట్టింది. నా తరువాత కూడా గుడికి కావలసింది మీరు చేయాలి.

మనిషికైనా, దేనిమీదైనా నమ్మకం ఉండాలమ్మా. అతనికి కష్టం వచ్చేటప్పుడు తట్టుకునే మనో ధైర్యాన్ని ఆ నమ్మకమే ఇస్తుంది. దేవుడి మీద నమ్మకం అది ఇస్తుందంటే...మనం ఎందుకు దాన్ని అడ్డుకోవాలి? దేవుడి భయం లేకపోతే, దేశంలో ఇప్పుడు జరుగుతున్న నేరాలు, అవినీతి శాతం ఇప్పుడున్న దానికంటే పదింతలు ఎక్కువగా జరుగుతుంది. తెలుసా?’

తన తండ్రి మాట్లాడేది నోరు తెరుచుకుని వింటూ ఉండేది ప్రశాంతి. ఆమెకు నమ్మకం లేకపోయినా ఆమె భర్త శ్రీనివాస్ కు దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉంది. అతను రోజూ కుంకుమ పెట్టుకోకుండా బయటకు రాడు.

ఆమే స్వయంగా గుడికి వెళ్ళటం ప్రారంభించింది. దేవుడ్ని ప్రార్ధించటం మొదలుపెట్టింది...ఇప్పుడు కూడా అతని కోసం, అతని సంతోషం కోసమే తాత్కాలికంగా అతని దగ్గర నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. అవతలి వారు అడిగినదంతా ఇచ్చే అలవాటున్న ప్రశాంతి -- మొట్ట మొదట ఆశపడింది శ్రీనివాస్ పైనే అనేది జ్ఞాపకానికి వచ్చింది.

అతని దగ్గర తన ఆశను చెప్పి, పెళ్ళి చేసుకోమని అడిగినప్పుడు అతను ఒప్పుకోలేదు. కానీ, అతనిపై ఒత్తిడి తెప్పించి, బలవంతంగా అతన్ని పెళ్ళి చేసుకోవటం తప్పో? లేక రాజ వంశంలో ఉన్న వాళ్ళకు సొంత ఆశలు ఉండకూడదో...? అందువలనే శ్రీనివాస్ ని నా దగ్గర నుండి వేరు చేసి తీసుకు వెళ్ళిందో?’ అనేటటువంటి ఆలొచనలు ప్రశాంతికి ఒక చేదు సంతోషాన్ని ఇచ్చింది. దారి పొడుగునా ఉన్న చెట్లలో నుండి కనబడిన ప్రకృతి దృశ్యాలు ఆమె మనసుకు హాయిగా ఉంది

రాత్రి మధురై చేరుకున్న ఆమె, అక్కడున్న ఒక హోటల్లో, ఇంతకు ముందే రిజర్వేషన్ చేసుకున్న రూములో ఉన్నది. గదిలో ఉన్న టెలిఫోన్ ద్వారా పిల్లలతోనూ, స్నేహితురాలుతోనూ మాట్లాడింది. నిద్రపోవటానికి ప్రయత్నం చేసి, కుదరకపోవటంతో దూరంగా ఉన్న గుడి గోపురమును చూస్తూనే పడుకుంది. నిద్రపోయింది.

ప్రొద్దున్నే లేచి స్నానం చేసిన తరువాత, టిఫిన్ తెప్పించుకుని తిన్నది. మార్కెట్టుకు వెళ్ళి అవసరమైన పచారి సరకులు తీసుకుంది. పాల పౌడర్, ఫ్లాస్కు, టీ-కాఫీ పొడి, చక్కెర, బియ్యం, పప్పు, ఎమర్జన్సీ లైటు, గొడుగు మరియు ఇతర సామానులు కొని, మధ్యాహ్నం భోజనం తొందరగా ముగించుకుని కోడైకానల్ వైపు కారులో బయలుదేరింది.

ప్రశాంతి యొక్క తండ్రి మార్తాండ చక్రవర్తి రాజ వంశానికి చెందినతను. బ్రహ్మచారిగా ప్రపంచమంతా తిరిగి వచ్చిన ఆయన, ఒక రోజు హఠాత్తుగా కుమారి అనే యువతిని వివాహం చేసుకుని వచ్చి నిలబడ్డాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆమెను, మార్తాండ చక్రవర్తి తల్లి-తండ్రులు వాళ్ళను చేర్చుకోనందువలన, ఆస్తిలో  సగం భాగాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చాశారు రాజా మార్తాండ చక్రవర్తి. 

ఇద్దరు మగపిల్లలు పుట్టినా, ఒక ఆడపిల్ల లేదేనన్న మార్తాండ చక్రవర్తి బాధను మరిచిపోయే విధంగా పుట్టిందే ప్రశాంతి. అదేంటో వాళ్ళ వంశానికే ఆడపిల్లలు  అంటేనే అచ్చి రాలేదు. కొన్ని తరాలుగా వంశంలో ఆడపిల్లలు లేరు. అలా కాదని అచ్చి రాని సాంప్రదాయాన్ని మీరి పుట్టిన ఆడపిల్లలూ బ్రతకలేదు.

కోడైకానల్ లో తన ఆంగ్లేయ స్నేహితుడితో గోల్ఫ్ఆడటానికి వచ్చాడు మార్తాండ చక్రవర్తి. మైదానం నుండి కొంచం దూరం జరిగి 'వెల్లకాని ' గ్రామానికి అవతల, కొండజాతి వారు జీవించే చోటునూ దాటి కనిపించిన ఒక అందమైన లోయలో ఒక రాజ భవనం ఇంగ్లాండ్ మోడల్లో కట్టించారు జమీందారు ఒకరు. ఆయన దగ్గర నుండి భవనాన్ని మార్తాండ చక్రవర్తి యొక్క ఆంగ్లేయ స్నేహితుడు కొన్నాడు.   

ఇటికిరాయి రంగుతో పెద్ద పెద్ద కిటికీలతో ఉన్న ఇంట్లో స్నేహితుడితో కలిసి  రాజ భోగ జీవితం అనుభవిస్తూ వచ్చాడు మార్తాండ చక్రవర్తి. అక్కడే కుమారి, ఫిక్స్ చేసిన తారీఖుకు ముందే ప్రసవ నొప్పులతో గిలగిల లాడుతుంటే, తన స్నేహితుడి భవనంలోనే, అక్కడున్న నర్సమ్మ సహాయంతో ప్రసవం జరిగింది. బంగారు శిలలాగా, తెల్ల తెలుపు రంగుతో పుట్టిన ఆడపిల్లకు ' ప్రశాంతి ' అని పేరు పెట్టి ఆనందపడ్డారు మార్తాండ చక్రవర్తి.

తరువాత కొన్ని రోజులలో మార్తాండ చక్రవర్తి యొక్క ఆంగ్లేయ స్నేహితుడు తన సొంత దేశమైన ఇంగ్లాండుకు వెళ్ళ వలసి వచ్చింది. అప్పుడు రాజ భవనాన్ని  మార్తాండ చక్రవర్తి యే కొనుక్కుని, తన కూతురుకు బహుమతిగా ఇచ్చాడు. భవనం చుట్టూ ప్రశాంతత నిండి ఉండటంతో భవనం ' ప్రశాంతి నిలయం' గా మారిపోయింది.  

రాత్రి మధురైలో స్టే చేసిన ప్రశాంతి, ప్రొద్దున త్వరగానే బయలుదేరింది. ముందే చెప్పి ఉంచటం వలన, వెళ్ళే దారిలో జీపులో వచ్చి కాచుకోనున్నాడు జనకరాజ్. నాన్నకు బాగా తెలిసినతను. అతన్ని కలుసుకుని, అతన్ని, అతనితో పాటూ వచ్చిన పని మనుషులనూ తన వెంట తీసుకుని -- ప్రశాంతి నిలయం కు బయలుదేరింది ప్రశాంతి.  

గ్రామానికి చాలాదూరంలో ఉన్నది ఇంద్ర భవనం. ఆమె జీవితంలాగానే ఈ ప్రశాంతి నిలయం కూడా ఆదరణ లేకపోవటంతో పాడుబడిపోయి ఉన్నది. వాహనాలు రాలేనంతగా పొదలు పెరిగి ఉండటంతో, అందరూ దిగి నడవడం మొదలుపెట్టారు.

జనకరాజ్ అన్నయ్యా...నేను ఇంకో పది రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాను. కారు వచ్చి వెళ్ళేలాగా బాటను సరిచేయాలి. మొదటి పనిగా -- నడవటానికి ఉన్న బాటను సరిచేయమనండి. మా పిల్లలకు డస్ట్ పడదు. అలర్జీ. ఇల్లు మొత్తం బూజు దులిపి, నేలంతా క్లీన్ చేయించి కడిగిపెట్టాలి. చలిని తట్టుకునేటట్టు, అన్ని కిటికీలకూ కర్టన్లు తగిలించండి. నేను మధురై నుండే రెడీమేడ్ గా అన్నీ కొనుకొచ్చాశాను. మనుషుల్ను పెట్టి తగిలించండి.

రెండో పనిగా -- రెండోది కాదు, ఇది-కూడా మొదటి పనే. కరెంటుకూ, ఫోను కూ మనుషులను పట్టుకుని ఎలాగైనా ఒక వారం రోజుల్లో వాటిని ఏర్పాటు చేయండి. వంటకి నాకు కిరోసిన్ కావాలి. కట్టెలు కూడా చెప్పండి. మన పక్క గ్రామం వాళ్ళ దగ్గర పాలు, కూరగాయలూ రోజూ తీసుకు వచ్చి ఇమ్మనండి

రాజ గంభీరంతో, సుడిగాలిలా ఆమె వేసిన ఆర్డర్లను ఒప్పుకుని నడవటం మొదలుపెట్టారు అందరూ.

పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బయిటి ఊరి నుండి వచ్చిన మనుషులు, విసుగు, అలసట అనేది చూపించకుండా పనులు చేసి ముగించారు. అప్పుడు ఇంటి వెనుకకు వెళ్ళిన ఒకతను పెద్దగా అరిచాడు.

అన్నా...ఇక్కడకు పరిగెత్తుకు రండి

ఏమిటో, ఏదో అనుకుని పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళందరూ అతను చూపించిన దిక్కు వైపు చూసి నిర్ఘాంతపోయి నిలబడ్డారు.

************************************************PART-4**********************************************

అక్కడ ప్రశాంతి నిలయం నుండి సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో తల విరుచుకుని ఉన్న ఆకారంలో నిలబడున్నది ఒక పెద్ద చింత చెట్టు. వేడి ప్రదేశాలలో మాత్రమే బాగా పెరిగి కాయలు కాచే తత్వం ఉన్న చెట్లు, కొంచం చల్లటి ప్రదేశాలలో తెలియక పెరిగినా కూడా, కాయలు కాయడం కష్టం. కానీ ఇక్కడ వొణుకు పుట్టించే చలిలో అందంగా కొమ్మలు విరిసి ఉండగా, చెట్టు నిండా కాయలు----అడిగే మనిషి లేక, కింద పడిపోయున్న కాయలు, రాక్షసుడి లాగా నిలబడి అందరినీ బెదిరిస్తున్నది చెట్టు. దాని చుట్టూ దట్టమైన పొదలు గుంపుగా ఉన్నాయి.

గబుక్కున తేరుకున్న జనక రాజ్ వీళ్ళను ఇక్కడే నిలబెడితే, మాటలు కోటలు దాటుతాయి!అనుకుని,

వెళ్ళండ్రా...వెళ్ళి పనులు చూసుకోండి. ఏదో చూడ కూడనది చూసినట్టు ఇక్కడే ఏమిట్రా గుంపు? మీరు కంబకరై నుండి వచ్చేటప్పుడు ఎన్ని చెట్లు చూసుంటారు?” అని కసురుకుని అందరినీ పనులకు పంపాడు.

లేదన్నా! చలి ప్రదేశంలో, మన ఊరి పక్కన లాగా ఒక చింత చెట్టును చూసిన వెంటనే భయం వేసింది. ఇలాంటి గుజ్జు ఎక్కువున్న కాయలు ఇక్కడ కాయవు. రకం చెట్లకు గుజ్జు ఎక్కువ లేని కాయలే ఉంటాయి. ఇక్కడ చూడండి...అడిగే వాడే లేని చోట, క్రింద పడున్న కాయలు పది మూటల వరకు ఉంటుంది! దీన్ని ఎలా   చుట్టు పక్కలున్న వాళ్ళు వదిలిపెట్టారు?” అంటూ ఆశ్చర్యంతోనే అందరూ తమ తమ పనులలోకి వెళ్ళారు.

ముందు భాగంలో ఉన్న స్నానాల గదిలోనూ, దానికి నేరుగా మేడ మీద ఉన్న రెండు స్నానాల గదులలోనూ ఎలాగో వైరింగ్ చేసి, అక్కడి కరెంటు వస్తువులను పనిచేసేటట్టు చేశాడు ఎలక్ట్రీషియన్.

ఇంట్లో ఉన్న మిగిలిన చోట్లలో వయరింగ్అంతా ఊడిపోయి వేలాడుతోంది. పూర్తిగా మార్చాలమ్మా. చాలా టైము పడుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే చెప్పండమ్మా చేసేద్దాం. వర్షాకాలం వస్తే ఇక్కడ కరెంటురోజుల తరబడి  పోతుంది. అందువలన కొవ్వొత్తులు ఎక్కువ కొని అట్టే పెట్టుకోండి

సాయంత్రానికి ఒక విధంగా ఇల్లు శుభ్రం అవగా, కొనుకొచ్చిన సామాన్లను పని వాళ్ళ సహాయంతో వంట గదిలో ఉంచారు. మిగిలిన పనులు ఏం ఏం చేయాలో చెప్పేసి, తిరిగి సొంత ఊరికి బయలుదేరింది ప్రశాంతి.

హైదరాబాద్ కు వెళ్ళిన వెంటనే తన పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దాడి ఆనందపడింది. అదే మొదటి సారివాళ్ళను వదిలి అన్ని రోజులు బయట ఊరులో ఉన్నది.

అమ్మా, గిరిజ నాకు భయంకరమైన కథ చెప్పింది

లేదమ్మా! వాడే దయ్యం ఎలా ఉంటుంది?’ అని అడిగాడు. అందుకే తల మీద తెల్ల తుండు వేసుకుని నటించి చూపించా

గిరిజా! చిన్న పిల్లాడ్ని ఇక మీదట అలా భయపెట్టకు. దయ్యాలు, భూతాలూ అన్నీ లేనే లేవు. అని గిరిజకు చెప్పి కొడుకు వైపు తిరిగి ఇక మీదట గిరిజ భయపెట్టినా, భయపడకు రాఘవ్అన్నది.

సరేనమ్మాఅని చెప్పి అమ్మ కొనుకొచ్చిన బొమ్మలను తీసుకున్నాడు.

తాను కొనుకొచ్చిన బొమ్మలను పెట్టుకుని -- ఆడుకుంటున్న గిరిజ, రాఘవ్ తో మెల్లగా తాము కోడైకానల్ వెళ్ళాల్సిన అవసరాన్ని చెప్పింది.

ఏమ్మా, నాన్న మళ్ళీ మిమ్మల్ని తిట్టేసి ఆంటీఇంటికి వెళ్ళిపోయారా? మనం ఎందుకమ్మా నాన్నకు నచ్చలేదు?”

వివరం తెలిసీ తెలియక మాట్లాడిన రాఘవ్ ను కన్నీటితో హత్తుకుంది. లేదురా! మనం అంటే మీ నాన్నకు చాలా ఇష్టం రా. అమ్మ తప్పు చేసింది కదా, అందుకనే తిట్టారు. త్వరలోనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు చూడు

తరువాత ఐదు సంవత్సరాల వయసున్న రాఘవ్ కు కథలు చెప్పి నిద్ర పుచ్చింది...పది సంవత్సరాల గిరిజ అడిగిన ప్రశ్నలకు వీలున్నంత వరకు జవాబు చెప్పింది.

అమ్మా, మాకు మందులు కావాలి కదా...అక్కడకెళ్ళిన తరువాత ఆయాసం వస్తే?”

లేదమ్మా! అక్కడి వాతావరణానికి ఆయాసం రాదని చెబుతున్నారు. అదొక్కటే కాదు, అక్కడున్న శుభ్రమైన పరిస్థితులకు అంతగా ఆయాసం రాదు. అదీ కాకుండా, ఇప్పుడు కొన్ని రోజులుగా మన ఇంట్లో జరుగుతున్న సంఘటనల వలనే మీకు మనసు కష్టం ఏర్పడి -- ఆయాసం వస్తోందని డాక్టర్.పద్మ చెప్పింది. ఎందుకైన మంచిది, అక్కడికి వెళ్ళిన తరువాత బయటకు వెళ్ళి ఆడుకోకండి. అది చాలా వరకు మీకు మంచి చేస్తుంది. అయినా, అక్కడికి మందులు కొంచంగా తీసుకు వెళ్తున్నాం.  ఇంకా ఎక్కువ అవసరం అయితే తెప్పించుకుందాం...సరేనా?”

సరేనమ్మా అని చెప్పి దుప్పటి కప్పుకుంది గిరిజ.

గుడ్ నైట్ చెప్పి, ఇద్దరికీ నుదుటి మీద ముద్దు పెట్టి, తనగదికి వెళ్ళింది. తలనొప్పి మొదలవటంతో...ఒక మాత్ర వేసుకుని పడుకుంది.  

భీమవరం లో తన రెగులర్ పనులలో లీనమైపోయున్న ఫాదర్ లారన్స్ కు హైదరాబాద్ లో ఉన్న సిస్టర్అమీలియా దగ్గర నుండి ఫోన్ వచ్చింది.

ఫాదర్. ప్రశాంతి జాగ్రత్తగా హైదరాబాద్ వచ్చేసింది. నాకు ఫోన్ చేసి పిల్లల చదువు గురించి మాట్లాడింది. స్వరం అదీ బాగానే ఉన్నది

దేవుడికి కృతజ్ఞతలు అని చెబుతూ ఏసుక్రీస్తు చిహ్నం వేసుకున్నాడు.

అమీలియా కంటిన్యూ చేసింది ఏం ఫాదర్ ప్రశాంతికి ఏమిటి? మీరు ఏసుక్రీస్తు డాలర్ కలిగిన గొలుసును మీ మెడలో నుండి తీసేసి ఆమె దగ్గర ఇచ్చినప్పుడే అడగాలనుకున్నా. మనవలన ఆమెకు ఏదైనా సహాయం చేయటం కుదురుతుందా?”

ఆమె వెడతానని తీర్మానించుకున్న ప్రదేశంలో ఆమెకు చెడు శక్తుల వలన ఏదో ఆపద వస్తుందని నాకు అనిపించింది. దానికి కారణం, ఆ రోజు ప్రశాంతి నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను జరిగి నిలబడి మీ సంభాషణ వింటున్నాను. అప్పుడు ఆమె గురించి నాకేమీ తెలియదు. మీతో మాట్లాడుతూ ఒక బంగళా పేరు చెప్పిందే, ‘ప్రశాంతి నిలయం అనుకుంటా -- పేరు మాత్రం ఒక బొంగురు ధ్వని కలిగిన మగ స్వరంతో నా చెవులకు వినబడింది.  

మొదటిసారి ఏదో భ్రమ అయ్యుంటుందని అనుకుని, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది క్షుణ్ణంగా విన్నాను. కానీ, ప్రతిసారీ పేరు నాకు అలాగే వినిపించింది. అప్పుడు ప్రదేశంలో ఏదో ఒక అమానుషం ఉన్నట్టు నాకు అనిపించింది. ఆపద నుండి అమ్మాయిని కాపాడటానికే నేను వేసుకున్న ఏసుక్రీస్తు డాలర్ ఉన్న గొలుసును నా మెడలో నుంచి తీసి ఆమెకు ఇచ్చాను. అది ఆమె దగ్గర ఉన్నంత వరకు, చెడు శక్తి ఆమెను ఏమీ చెయ్యలేదు

ఫాదర్ లారన్స్ ప్రశాంతత కోల్పోయి శ్రమ పడుతున్న ఆత్మలకు ప్రత్యేక ప్రార్ధనలను చాలా చేసి -- ఆత్మలు ప్రశాంతత పొందటానికి దారి చూపారు. ఆయన చెప్పేది నిర్లక్ష్యం చేయకూడదు’, ఆలొచనలలో చెప్పుకుంది అమీలియా.

ఫాదర్, అర్జెంట్ పని మీద నేను ఇప్పుడు బెంగళూరు బయలుదేరుతున్నా.నేను వచ్చిన వెంటనే ప్రశాంతితో మాట్లాడి, ఎలాగైనా ఆమెను బంగళాకు వెళ్ళకుండా అడ్డుకొవటానికి ప్రయత్నిస్తాను

మరికొన్ని విషయాలు గురించి మాట్లాడిన తరువాత ఇద్దరూ ఫోన్ లను కట్ చేసారు.

బెంగళూరు వెళ్ళి వచ్చిన తరువాత ఖచ్చితంగా ప్రశాంతిని కలవాలి, ఆమెను ప్రశాంతి నిలయం కు వెళ్ళకుండా ఆపాలిఅని తన డైరీలో గుర్తుగా రాసుకుంది అమీలియా.

కానీ, అమీలియా ఊరి నుండి తిరిగి వచ్చినప్పుడు కార్యం చెయ్యి దాటిపోయింది

************************************************PART-5**********************************************

రెండు రోజులు కాస్త ప్రశాంతతగా ఉన్నట్టు అనిపించింది ప్రశాంతికి. రోజు ప్రొద్దున రాఘవ్, ఫాదర్ లారన్స్ ఇచ్చిన గొలుసును పెట్టుకుని ఆడుకుంటూ తెంపాశాడు. దాన్ని టేబుల్ సొరుగులో పడేసింది. మనసే సరి లేదు. తాను చేసేది కరెక్టా...తప్పా అనే అయోమయం ఆమెను చుట్టు ముట్టుంది. అయోమయం విసుగ్గా మారింది.  

విసుగును మరింత పెంచే విధంగా ఎవరో ఫోన్ చేసి మేడం! మీరు విడాకులు ఇవ్వకపోయినా, మీ భర్త శ్రీనివాస్ తోనే జీవిస్తానని స్వప్ణ సుందరి స్నేహలత చెప్పిందే...దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?” -- అని అడుగ....

అలాగా? అయితే అలాగే జీవించమని చెప్పండి

అంటే మీరు విడాకులు ఇవ్వటానికి ఇష్టపడటం లేదా?”

నేను అలా చెప్పలేదే!

మీరు చెప్పిన దానికి అదేగా అర్ధం మేడం. అలాగైతే మీరు విడాకులు ఇవ్వటానికి తయారుగా ఉన్నారా?”

నేను అలాగనీ చెప్పలేదే! వాళ్ళు చెప్పిన దానికి నేను అభిప్రాయం చెప్పదలచుకోలేదు. సారీ అని చెప్పింది. కానీ, ఆమె కోపం కొంచం కూడా తగ్గలేదు.

సాయంత్రం న్యూసులో, ‘భర్తకు విడాకులు ఇవ్వటానికి యువరాణి ప్రశాంతి ఒప్పుకోలేదు. కావాలంటే పెళ్ళి చేసుకోకుండానే జీవించ వచ్చు అని ఇద్దరూ చేరటానికి పరోక్షంగా సమ్మతం తెలిపిందిఅని వచ్చిన న్యూస్ ను చూసి మరింత నొచ్చుకుంది. ఎంత తొందరగా కుదురుతుందో, అంత తొందరగా ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టింది. ఆమె ఎక్కడికి వెడుతున్నదీ ఎవరికీ చెప్పలేదు!

స్నేహలత విడాకుల పత్రంలో సంతకం తీసుకోవటానికి ప్రశాంతిని ఏదైనా చెయ్యటానికి రెడీగా ఉంది. కుదరదు, నా శ్రీనివాస్ ను వదిలి నేను పర్మనెంట్ గా విడిపోయి ఉండలేను. దానికి టెంపరరీ విడిపోవటం పరవాలేదు’ -- అని  అనుకుంటూనే ట్రావల్స్ కు ఫోన్ చేసి వాళ్ళు రేపు బయలుదేరుతున్నట్టు చెప్పి, ప్రయాణాన్ని ఖాయపరచింది ప్రశాంతి.

ప్రశాంతతను వెతుక్కుని ప్రశాంతి నిలయానికి వెళ్ళాలనుకుంటున్న ఆమెకు అక్కడ ప్రశాంతత దొరుకుతుందా? లేక...కాస్తో,గీస్తో ఉన్న ప్రశాంతతను కోల్పోతుందా?’ అనేది తెలియటం లేదు.

ఎందుకంటే, ఆమె హైదరాబాద్ కు తిరిగివచ్చిన నాలుగు రోజుల్లో, ‘ప్రశాంతి నిలయం బంగళా వెనుకవైపు కొంచం దూరంలో ఉన్న పెద్ద సమాధుల తోటను చూసి భయపడి పోయి, అక్కడ  పనిచేస్తున్న పనివాళ్ళందరూ అక్కడ్నుంచి తిరిగి వెళ్ళిపోయింది పాపం ప్రశాంతికి తెలియదు కదా!

బత్లగుండు -- పెరియకులం నుండి కోడైకానల్ కు గాడిదల మీద మిరియాలు, బెల్లం, ఏలకాయలు, పనస పండ్లు, అరటిపండ్లు -- ఇంకా మరికొన్ని వస్తువులు కలిగిన చిన్న చిన్న మూటలను ఎక్కించి, చిన్న వ్యాపారస్తులు తీసుకు వెళ్ళటం మామూలు.

వాళ్ళకు దగ్గరి దోవ కుంబకరై నుండి మొదలవుతుంది. కొన్ని చోట్ల రాళ్ళూ రప్పలుగా ఉన్న బాటను దాటి వెల్లకావి దారి ద్వారా కోడైకానల్ వచ్చి చేరటం వాళ్ళకు నిత్య గండం పూర్ణ ఆయుషే! అక్కడ ఉండే పలురకాల కొండజాతి కుటుంబాలు -- తాము ఎప్పుడూ చేసే పనులతో పాటూ వ్యాపారస్తులకు సహాయపడటం కూడా చేస్తూ వచ్చారు. అంతే కాకుండా మంచి లాభంతో వ్యాపారం జరిగితే, సహాయపడిన కుటుంబాలకు ఆడంబర విందు ఉంటుంది.

వ్యాపారులు వచ్చే దోవలో ఒక పాడుబడ్డ మండపం దగ్గర పనులకోసం తయారుగా కూర్చోనుంటారు కొండజాతి మగవారు. వ్యాపారస్తులు చెప్పే బేరం నచ్చితే, మూటలూ, బుట్టలూ తీసుకుని బయలుదేరుతారు. ఎప్పుడు తగిన బేరం దొరుకుతుందో తెలియదు కనుక ఒక కూజాలో మంచి నీళ్ళు, ఇంకో కూజాలో గంజి తెచ్చుకుని కూర్చునే అలవాటు వాళ్ళకు!

మంగమ్మ, ఒక చిన్న కూజాలో ఊరబెట్టి ఉంచిన చేపల పులుసును గరిటతో కలిపి, అరచేతి సైజుకు చింపిన అరిటాకును పెట్టి కూజాను మూసింది. కింద వాలకుండా ఉండేందుకు -- అరటి నార పెట్టి కూజా మెడను గట్టిగా కట్టింది.

వీధిలో బొంగరం ఆడుకుంటున్న కొడుకు రాజుని పిలిచింది.

రాజూ, మీ అయ్య ప్రొద్దున నీరాహారం కూడా తాగకుండా బయలుదేరాడు. గంజిని, చేపల పులుసును మండపానికి వెళ్ళి ఇచ్చిరా నాయనా అంటూ వాడి చేతికి బుజాన తగిలించుకునే సంచీ ఒకటి ఇచ్చింది.

బొంగరం ఆట ముగించుకుని -- ఇంటికి వచ్చిన వెంటనే తినబోయే చేపల పులుసు, అతను చేయ బోయే పనికి తల్లి ఇచ్చిన సంచీలో నుండి వస్తున్న వాసన నోరు వూరిస్తుంటే, నడుము దగ్గర ఉండటానికి శ్రమ పడుతున్న లాగూను మొలతాడుతో చుట్టి బయలుదేరాడు.

ఆగండిరా...ఒక్క పరుగున వెళ్ళి వచ్చేస్తాను అని స్నేహితులకు చెప్పి సంచీని మెడలో వేసుకుని -- వేగంగా మండపం వైపు నడవటం మొదలుపెట్టాడు.

వేగంగా పరిగెత్తితే పులుసు ఒలికిపోతుంది. తరువాత అమ్మ తిడుతుంది

మండపంలో ఉన్న తండ్రి బయలుదేరి వెళ్ళిపోయుండటంతో తిరిగి మోత బరువును మోసుకుని రావలసి వస్తోందే అని విసుక్కుని ఇంటికి నడవసాగాడు.

అక్కడొక చోటకు వచ్చిన తరువాత బాట రెండుగా విడిపోతుంది. రెండో బాటలో వెడితే ఒక్క పరుగుతో త్వరగా ఇల్లు చేరుకోవచ్చు. మామూలు దోవలో వెడితే చాలా సమయం పడుతుంది. కానీ, రెండో బాటను ఎవరూ వాడరు.   బాటలో వెళ్ళొద్దని గ్రామమే చెబుతుంది. ఎందుకో రాజుకు తెలియదు...కానీ ఇంటికి త్వరగా వెళ్ళాలి, స్నేహితులతో బొంగరం ఆడాలి ఆనే ఆశ వాడిని అయోమయంలో పెట్టింది.

రెండో బాటలో వచ్చామని తెలిస్తే, అంతే, అమ్మ బెత్తం పుచ్చుకుని వొళ్ళు వాచిపోయేటట్టు కొడుతుంది. దానికంటే, స్నేహితుల ఆటలు ముగిసిపోతాయే నన్న బాధ ఎక్కువగా ఉండటంతో, భయపడుతూనే రెండో బాటలో  నడవసాగాడు.

ఆ రెండో బాటలో ఉన్న పాత ఎర్ర రంగు ఇల్లును దాటుతున్నప్పుడు, ఎవరో తమ్ముడూఅని పిలిచిన శబ్ధం వినబడింది.

రాజు ఇంట్లోకి వచ్చినప్పుడు, అతని వెనుక అతని స్నేహితులు గుంపుగా రావటంతో మంగమ్మకి ఏమీ అర్ధం కాలేదు. గాలి ఊదే గొట్టంతో పొగలు వస్తున్న తడి కట్టెలను మంట కోసం ఊదుతున్న ఆమె, కళ్ళు నలుపుకుని, కొడుకును బాగా చూసింది.

ఎక్కడదిరా కొత్త చొక్కా? మీ నాన్న ఇచ్చాడా?”

అమ్మా రెండో బాటలో ఎర్ర రంగు ఇల్లు ఉంది కదా! అక్కడున్న ఒక అన్నయ్య నువ్విచ్చిన చేపల పులుసు తీసుకుని...దానికి బదులుగా చొక్కా ఇచ్చాడు. ఇక మీదట చేపల పులుసు రొజూ చేసిస్తావా? అన్నయ్య చూడటానికి రాజ వంశం రాజులాగా బాగున్నాడు

అధిరిపడ్డది మంగమ్మ. అరే పాపిస్టి కొడకా! రెండో బాటలో ఎర్ర రంగు ఇల్లు ఉన్నదనే రెండో బాటను ఎవరూ వాడరు. బాటలో వెళ్ళ కూడదని నీకు తెలుసు కదా! ఎందుకు వెళ్ళావు? మునీశ్వరుడా...నువ్వే తండ్రీ నా కొడుకును కాపాడాలి

ఇంట్లోని దేవుని ఫోటోల దగ్గర కాగితోంలో తమ కుల దేవుని మఠంలో ఇచ్చిన విబూధిని పిడికిలితో తీసుకుని కొడుకుపైన జల్లి, నుదుటి మీద అద్దింది. వాడు వేసుకున్న చొక్కాను విప్పి -- మండుతున్న  కుంపటిలో వేసింది. గబగబ అంటుకుంది పట్టు చొక్కా. తన తల వెంట్రుకలను పైకెత్తి ముడి వేసుకున్న ఆమె, ఏడుస్తూ రారా! పూజారిని వెళ్ళి చూసొద్దాం అని  కొడుకును పిలుచుకుని పరుగు,నడకలతో బయలుదేరింది.

---వాడు అర్ధం కాకుండా తల్లిని చూశాడు.

************************************************PART-6**********************************************

కాటుకలాంటి చీకటి అలుముకున్న రాత్రిపూట, ప్రశాంతి నిలయం నుండి ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న మునీశ్వరుడి గుడిలో, పూజరి ఎదురుగా రాజు తన తల్లి-తండ్రులతో నిలబడున్నాడు.

ఏరా పిచ్చి పిల్లాడా! ఎర్ర రంగు ఇంటి పక్కకు పోకూడదని చెప్పుంచాము కదా, దానిని అధిగమించి మిట్ట మధ్యాహ్నం సమయంలో చేతిలో చేపల పులుసుతో, బూతాల బంగళా దారిలో వెళ్ళావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి?”

విరిగిపోయిన అద్దం ముక్కలను ఒక రేకు డబ్బాలో వేసి ఆడిస్తుంటే వచ్చే ఒక కర్న కటోర స్వరం పూజారికి. స్వరంతో అతను అరుస్తూ డోలు వాయిస్తుంటే, ఎదురుగా నిలబడ్డ వారికి వణుకు ప్రారంభమవుతుంది.

చిన్న పిల్లాడు...వివరం తెలియక చేశాడండి. ఇక మీదట అలా జరగదయ్యా. సారికి మీరు ఎలాగైనా సరిచేయాలి. బూత పిసాచాల గాలి సోకకుండా పిల్లాడ్ని మంత్రించి పంపండి కళ్ళల్లో నీరు పొంగుకు వస్తుంటే బ్రతిమిలాడింది మంగమ్మ.

మంగమ్మామనుషుల లాగానే దయ్యాలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి  మంచి దయ్యం. రెండోది చెడ్డ దయ్యం. మంచి దయ్యం ఒక ముద్ద తింటేనే తృప్తి పడుతుంది. చెడ్డ దయ్యం రక్తం వాసన చూడకుండా వదలదు. కొన్ని వెంటనే మనిషిని చంపేస్తాయి. ఇంకా కొన్ని వ్యక్తి మీద ఎక్కి కూర్చుని కొంచం కొంచంగా ప్రాణం తీస్తుంది.

మరికొన్ని చిన్న పిల్లలలాగా మనుషుల్ని భయపెట్టి ఆడుకుంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణంమీ అబ్బాయితో మాట్లాడింది మంచి దయ్యంగా ఉండబట్టే, నువ్విప్పుడు వాడ్ని తీసుకుని ఇక్కడికి వచ్చావు. లేకపోతే ఇంతే సంగతులు

కొడుకు రాజుని దగ్గరకు తీసుకుని హత్తుకుంది మంగమ్మ. అయినా భయంతో వణికిపోతూ నిలబడున్నారు కన్నవాళ్ళు.

ఇంట్లో కూర్చుని అంత గోల చేస్తున్నాయే, వాటిని ఏమీ చేయలేమా పూజారీ?ఆందోళనతో అడిగాడు రాజు తండ్రి.

ఒకటి అర్ధం చేసుకో. మట్టిలోనే బంగరమూ ఉంది, నీళ్ళూ ఉన్నాయి.కానీ, తవ్విన ప్రతి చోటా అవి దొరుకుతున్నాయా? దానికని ఇవ్వబడిన చోటులోనే అది దొరుకుతుంది. ఒక్కొక్క దానికీ ఒక మట్టి రకం కావాలి కదా? అదేలాగా ప్రశాంతత లేకుండా తిరిగే ఆత్మలకు ఇల్లు అవి ఉండటానికి బాగుంది. మీ ఇంట్లో నిద్రపోతున్న నిన్ను అవేమన్నా చేస్తున్నాయా, లేదే! వాటి దారిలో అడ్డు వెళ్ళే వాళ్ళను మాత్రమే అవి కష్టపెడతాయి.

రోజు పూజలో పాల్గొని ఇంటికి వెళ్ళు. రాజూ నువ్వు కూడా వాటిని ఇబ్బంది పెట్టకు. అవి కూడా నిన్ను ఇబ్బంది పెట్టవు. ఇక మీదట ప్రతి అమావాస్య రోజున పూజలు జరిపి వాటికి పిండాలు పెట్టిస్తాను. అవి కాస్త అయినా శాంతపడని

పూజారి డోలక్ తీసుకుని, దాన్ని కొడుతూ మునీశ్వర దేవుని పాట పాడుతున్న శబ్ధం వన ప్రాంతమంతా పూర్తిగా ప్రతి ధ్వనితో మునిగిపోయింది.

మెల్లగా మొదలై పాట వేగం పుంజుకోవటం మొదలయ్యింది. చీకటి వేళలో డోలు శబ్ధం, పూజారి గంభీర స్వరం వింటున్న వారికి పొత్తి కడుపంతా తిప్పటం జరిగింది.

పూజారి పాడగా, పాడగా ప్రశాంతి నిలయానికి దగ్గరలో ఉన్న  చింత చెట్టు పాటకు తగినట్టు గాలిలో ఊగింది. అది జల్లు,జల్లు మని కాళ్ళకు గొలుసు కట్టుకుని ఎవరో ఆడుతున్నట్టే ఉంది. పాట ఆగిన వెంటనే చెట్టు ఊగడం ఆగి ప్రశాంతత పొందింది.

ప్రశాంతీ! ఇప్పుడు నువ్వు కచ్చితంగా ప్రశాంతి నిలయానికి వెళ్ళాలసిందేనా? కావాలంటే మీ అన్నయ్యల దగ్గరకు వెళ్ళి ఉండవచ్చు కదా?”

లేదు పద్మా, మా అన్నయ్యలకు మొదటి నుంచే నాతో పెద్దగా మంచి  బంధుత్వం లేదు. ఇప్పుడు అక్కడికి వెడితే అగౌరవంగా ఉంటుంది

అయితే మీ అమ్మ దగ్గరకైనా వెళ్ళి ఉండు

చేదుగా నవ్వింది ప్రశాంతి.

ఇప్పుడు అమ్మ ఉండేది ఆమె అన్నయ్య ఇంట్లో. అంటే శ్రీనివాస్ వాళ్ళింట్లో! నేను ఇప్పుడు అక్కడికి వెడితే గొడవకు ఇంకొంచం చోటు ఇచ్చినట్టు అవుతుంది. నీ కొకటి తెలుసా? మా అమ్మ చెబుతోంది, శ్రీనివాస్ తో కొంచం సర్ధుకొని వెళ్ళు. నీ స్వార్ధం మాత్రం చూడకుండా, అతని మనసు కూడా చూడు. పెళ్ళి చేసుకుని పది సంవత్సరాలు అయినా అతని మనసు దాని దగ్గరకే వెడుతోందంటే...ఆమె మీద అతని లోతైన ప్రేమను అర్ధం చేసుకోమని చెబుతోంది

ఏమిటే...ఆంటీనా అలా చెబుతోంది? తన కూతురు దగ్గర ఎవరైనా ఇలా చెబుతారా?”

ఆమె నా తల్లి స్థానం నుండి, శ్రీనివాస్ యొక్క అత్తయ్య స్థానానికి వెళ్ళి చాలా  సంవత్సరాలు అయ్యింది. నిజం చెప్పాలంటే నేను పట్టుదల పట్టి శ్రీనివాస్ ను పెళ్ళి చేసుకున్నది అమెకు కొంచం కూడా ఇష్టం లేదు

అదెందుకని!?”

ఎందుకని...? ఒక్క క్షణంలో చెప్పేయచ్చు. కానీ ఇందులో తన కుటుంబ పరువు కూడా కలిసుంది! రాజా మార్తాండ చక్రవర్తి యొక్క పరువు, మర్యాద విధంగానూ తక్కువ కాకూడదు

మౌనంగా ఉన్న ప్రశాంతి చేతులను పట్టుకున్న పద్మ, “సరే, ఊరికి వెళ్ళే నీ నిర్ణయం గురించి నేనేమీ చెప్పను. కానీ, కోడైకానల్ లోనే ఏదో ఒక ఇల్లు తీసుకుని ఉండొచ్చుగా. ఒక అద్వాన్నమైన అడవి బంగళాలో వెళ్ళి నివాసముంటే, నిన్ను నేను ఎలా కాంటాక్ట్ చేయగలను. నువ్వు ఉండే చోటు మీ అమ్మకు కూడా  తెలియకూడదని చెబుతున్నావు. ఊరికి వెళ్ళటానికి ఏదో ఒక పిచ్చి ట్రావల్స్ నుండి కారు బుక్ చేసుకుని వెడుతున్నావు. నాకెందుకో భయంగా ఉందే

లేదు పద్మా. బంగళాను ఒక వ్యక్తి చాలా రోజులుగా కొనుక్కుంటానికి అడుగుతున్నాడు. ఏదో హోటల్ మొదలు పెడతాడట. కానీ, అతి తక్కువ ధరకు అడుగుతున్నాడు. నేను వెళ్ళి కొంచం ఇంటి లోపల, ఇంటి బయట సరి చేసి, వేరే ఎవరికైనా అమ్మగలనేమో నని ప్రయత్నిస్తాను

ఆమె చెప్పి ముగించేలోపు ఆమెకు కుడిపక్క ఉన్న గదిలోని డ్రస్సింగ్ టేబుల్  అద్దం జల్లుమని విరిగింది.

పద్మానూ, ప్రశాంతీనూ మాట్లాడుకుంటున్నది ఎడమ చేతివైపు ఉన్న అలమరా కర్టన్ వెనుక నిలబడి వింటున్నది పనిమనిషి వెంకాయమ్మ. మెల్లగా బయటకు జారుకుంది.

ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి దూరి మనసులో కంఠస్తం  పట్టి ఉంచుకున్న నెంబర్లను డయల్ చేసి మెల్లగా చెప్పింది. రాజమ్మేనా? నేనే వెంకాయమ్మ మాట్లాడుతున్నాను...అని పిలిచి వివరం చెప్పింది.

టెలిఫోన్ పెట్టేసిన రాజమ్మ  పరుగున తన యజమానురాలు స్నేహలత దగ్గర విషయం చెప్పింది. స్నేహలత ముఖం భయంకరంగా మారింది.

ప్రశాంతీ, నా దగ్గర నుండి తప్పించుకుందా మనుకుంటున్నావా? నిన్ను ఏం చేయాలో అది చేస్తాను’ 

************************************************PART-7**********************************************

నవంబర్ నెల పొగమంచు, ఎదుట వస్తున్న వ్యక్తుల ముఖం కూడా సరిగ్గా కనిపించనివ్వకుండా కష్టపెడుతోంది. ఇద్దరు పిల్లలను చేత్తో పట్టుకుని చిన్న కాంపౌండ్ గోడను దాటి బాగు చేయబడి ఉన్న ఒంటరి బాటలో ఇంటివైపుగా నడవటం మొదలుపెట్టింది ప్రశాంతి.

ఇల్లు ఏమంత దూరంలో లేకపోయినా, చాలా దూరం నడిచే వచ్చిన ఒక భావం. దూర ప్రయాణం వలన బాగా అలసిపోయినట్లు తెలుసుకుంది. తనకే ఇలాగంటే, చిన్న పిల్లలకు ఎంత కష్టంగా ఉండుంటుంది.

ఇంకా ఎంత దూరమమ్మా?”

ఇదిగో వచ్చాశాము. అక్కడ చూడు అంటూ ఎదురుగా కనిపించే ఇంటిని చూపించింది.

మోస్తరు శుభ్రంగానే కనబడింది ఇల్లు. దుప్పట్లు అందంగా వేయబడి, బెడ్ రూములు రెండూ మేడ మీద అందంగా ఉన్నాయి. దీనికి జనకరాజ్ కు అభినందనలూ, ఇల్లు తాళం వేయకుండా తలుపులను మాత్రం దగ్గరకు వేసినందువలన ఒక మొట్టికాయ వేయాలి అని ఆలొచిస్తూ ఇంట్లోని మిగిలిన ప్రదేశాలను చూసింది.

పాతవి, ఉపయోగించలేని వస్తువులు మేడ మీద ఒక గదిలో పడేసి తాళం వేయబడి ఉంది. అక్కడున్న తాళం చెవుల గుత్తిలో గదుల వరుసలో తాళం చెవులు వేలాడుతున్నాయి. వంట గదిలోకి వెళ్ళింది. అక్కడ కిరసనాయల్ తో పాటూ స్టవ్వు రెడిగా ఉండటం చూసి తృప్తి పడింది. తాను కొనిపెట్టి వెళ్ళిన కొత్త గిన్నెలను ఎవరో ఉపయోగించినట్లు గుర్తులు కనబడ్డాయి.

తాను బయలుదేరేటప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కొత్త స్టవ్వుపై కాఫీ పెట్టుకోమని చెప్పింది జ్ఞాపకానికి వచ్చింది. వాళ్ళు కాఫీ మాత్రం పెట్టుకున్నట్టుగా కాక...వంట కూడా చేసుకున్నది -- సగం కట్ చేయబడున్న ఉల్లిపాయ, టమేటో, గోడకు చివర కనబడకుండా వంచి పెట్టిన కత్తిపీట చెప్పకనే చెబుతున్నది.

మొదట కొంచం కోపం వచ్చినా --- పాపం... అద్వాన్నమైన అడవిలో వాళ్ళు మాత్రం తిండికి ఎక్కడికి వెడతారు?’ అనే ఆలొచనా వచ్చింది.

పరవాలేదులేఅని తనలో తానే చెప్పుకుంది.

ఇంకొకొరు ఉపయోగించినది ఏదీ ప్రశాంతికి నచ్చదు. తన నెక్లస్ను ఒకరోజు ఆమె వదిన పెట్టుకున్నదని తెలుసుకున్న ప్రశాంతి తరువాత దాన్ని ఆమెకే ఇచ్చేసింది. చిన్న వస్తువులనే అవతలి వాళ్ళు ముట్టుకుంటే ఇష్టపడని ప్రశాంతి -- ఐదడుగులు, ఎనిమిది అంగుళాల ఎత్తులో -- దానికి తగిన శరీర ధారుఢ్యం కలిగి రాజుగారి గంభీరంలో తన మనసును పూర్తిగా ఆక్రమించిన భర్తను, పూర్తిగా ఇంకొక ఆమెకు ఇచ్చేసి ఒంటరిగా నిలబడింది.

స్నేహలత ముట్టుకుంది కాబట్టి తన శ్రీనివాస్ ను ఒక వస్తువు లాగా ఆమెకు ఇవ్వగలదా ఏమిటి?’

కుదరదు! నా శ్రీనివాస్ నాకు మాత్రమే సొంతం

చిన్నగా...కానీ, ఖచ్చితంగ చెప్పుకుంది.

హైదరాబాదులో, తన భార్య గురించిన ఆలొచనలలో ఉండి కొంచం నిద్రకు లొంగిన శ్రీనివాస్ కలలో ప్రశాంతి కనబడి ఖచ్చితమైన స్వరంతో చెప్పింది.

నా శ్రీనివాస్ నాకు మాత్రమే సొంతం -- ప్రశాంతి శ్రీనివాస్ ను గట్టిగా కౌగలించుకుంది.

నిద్రలోనూ శ్రీనివాస్ మొహంలో నవ్వు పరిగెత్తింది. 

నన్ను పట్టుకుని ఇన్ని కష్టాలు పెడుతున్నావే! ఇంట్లో ఉంటే కౌగలించుకుని వేలాడుతున్నావు. ఉద్యోగానికి వెళ్ళినా, ఎటు చూసినా నీ మొహమే తెలుస్తోంది. నా మీద ఎటువంటి వసీకరణ మంత్రం వేశావో?”

వసీకరణ మంత్రం వేయాలని ఏమీలేదు డియర్. మీ మనసులో చాలా రోజులుగా నేను ఉన్నాను. బావిలో ఉన్న నీరులాగా బయటకు కనబడకుండా ఉన్నాను. మీ మట్టి బుర్రకు ఇప్పుడే అర్ధమవుతోంది

ఏదైనా నీకు ధైర్యం ఎక్కువ. నా ఒడిలో పడుకుని, నన్నే మట్టి బుర్ర అని చెబుతున్నావు. ప్లీజ్ ప్రశాంతీ, రోజు నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది. ప్రొద్దున మాత్రం ఆఫీసుకు వెళ్ళి వచ్చేస్తాను

మనసు లేక పోయినా లేచింది.

నిద్రలో కూడా ఏదేదో వాగుతున్నాడు శ్రీనివాస్.

నడిచి రావటం వలన గొంతు ఎండిపోయింది. మొదట ఒక చెంబుడు నీళ్ళను గడగడమని తాను తాగేసి, తరువాత పిల్లలకు కూడా ఇచ్చింది. ముగ్గురూ కలిసి సగం బిందెను ఖాలీ చేశారు. అదే వాళ్ళ కడుపును నింపగా, తరువాతే అలసట తెలిసింది.

ముగ్గురూ పెద్ద సోఫాలోనే అలసిపోయి నిద్రపోయారు. కొంచం సమయం తరువాత లేచింది ప్రశాంతి. మొదట ఏదైనా వంట చేయాలిఅని అనుకుంటూనే వంట గది అలమరాలో సర్ది పెట్టబడ్డ ఎర్ర డబ్బాలను తీసి ఊపింది.

పరవాలేదు! పచారి సరకులేమీ అంతగా తగ్గి పోలేదుఅని తృప్తి పడింది.

హాలులో పిల్లలు ఆడుకోవటం సంగీతంలా వినబడింది.

చాలా రోజుల తరువాత మనసులో ఒక ప్రశాంతత ఉండటం అనుభవించింది. ఎవరి ఇబ్బందీ లేదు. శ్రీనివాస్ ని స్నేహలత తో అక్కడ చూశాను, ఇక్కడ చూశానుఅని చెప్పి ఆమె మనసును కష్టపరిచే ఫోన్ పిలుపులు ఇక ఉండవు. దేంట్లోంచో విడుదల అయిన ఫీలింగ్. కొన్ని సార్లు సంతోషం కూడా కలిగింది.

హైదరాబాద్ లో ఇరుకైన పరిస్థితిలో పెరిగిన పిల్లలకూ అలాగే ఉండుంటుంది!

ఆకలేస్తే, అలమరాలో బిస్కెట్లు ఉంచాను. తీసుకు తినండి. అమ్మ ఇప్పుడెల్లి వంట చేస్తుంది. వంట సుమారుగానే ఉంటుంది.మంచి పిల్లలుగా అడ్జెస్ట్చేసుకుని తింటారట

వద్దమ్మా...ఆకలే లేదు

అలాగంతా చెప్పకూడదు రాఘవ. తింటేనే కదా ఇంకా బాగా ఆడుకోగలవు. లేకపోతే నీరస పడిపోతావు. ఇద్దరూ రోజు బాగా రెస్టు తీసుకోండి. రేపట్నుంచి రోజూ ప్రొద్దున రెండు గంటలూ, సాయంత్రం రెండు గంటలూ చదువుకోవాలి. మీకు చదువు చిప్పించే టీచర్ వచ్చేంత వరకు, నేను చెప్పిస్తాను. ఆవిడ వచ్చిన తరువాత ఇద్దరం చెప్పిస్తాం

సరేమ్మా అని తల ఊపటాన్ని చూసి గర్వంగా అనిపించింది! ఎంత కష్టం వచ్చినా, ముఖం మాడ్చుకోని పిల్లలు. దేవుడు నాకిచ్చిన వరం.

ఇంటి చుట్టూ ఉన్న పొదలను పని వాళ్ళు బాగు చేశారు. ఎండిపోయిన చెట్ల మొక్కలను ఏరకుండా వదిలేసి ఉన్నారు. అవి, ముందు రోజు కురిసిన వర్షానికి తడిసిపోయి -- నేల మీద అక్కడక్కడా అంటుకోనున్నాయి.

దీన్ని మొదటగా శుభ్రం చేయాలి. చలికాలం మొదలైంది. ఆకాశం ఇంకో నాలుగైదు నెలలు మేఘాలు కప్పబడే ఉంటుంది. చలి కాచుకోవటానికి కొంచం కట్టెలు కొని ఉంచాలి

ఇలా ఆలొచిస్తే కూర్చోని ఉన్న ఆమెను 'రింగ్...రింగ్' అనే గంట ఆశ్చర్యపరిచింది.

************************************************PART-8**********************************************

1800 లలో ఆంగ్లేయులు కోడైకానల్ కు విజయం చేశారు. మిగిలిన చోట ఎండ వేడి వాళ్ళను కష్ట పరిచింది. ఐరోపాలోని కొన్ని దేశాలలోని చల్లదనం, మితమైన ఎండ వాళ్ళను అక్కడ కట్టి పడేసింది.

కనుక, చాలా మంది వాళ్ళ దేశం ధోరణిలో కోడైకానల్లో ఇల్లు కట్టి ఉంచి,  భరించలేని ఎండ ఉన్నప్పుడు, కోడైకానల్ కు వచ్చి ఉండే వాళ్ళు. కొండ జాతి వారి అధికార హక్కు కలిగిన కొండ ప్రాంతం, బోటింగ్ క్లబ్, గోల్ఫ్ గ్రౌండ్ అంటూ మెల్ల మెల్లగా అభివ్రుద్ధి చెందింది. అలాగే కరెంటును నమ్మకుండా కట్టబడిన ఇళ్ళల్లో, కాలింగ్ బెల్ కూడా, చేతితో లాగితే లోపలి వాళ్ళకు వినబడుతుంది. 

బెల్ కొట్టే మోత వినబడి హడావిడిగా లేచింది. ఇటువైపు రెగులర్ గా వెళ్ళే వ్యక్తులు, ఇంట్లో మనుషులు తిరగటం చూసి వచ్చుంటారుఅనుకుంటూ తనని తాను సమాధాన పరుచుకుంది

తలుపు తెరిచిన ప్రశాంతి బయట నిలబడ్డవారిని చూసి ఇంకొంచం ఎక్కువగానే ఆశ్చర్యపోయింది.

గుడ్ మార్నింగ్ మ్యాడం

లోపలకు రండి. మీరొస్తారని పోయిన వారం సిస్టర్అమీలియా చెప్పింది. కానీ, ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు. మంచు బాగా పడుతున్నందు వలన ఇంకా కొన్ని రోజులు పడుతుందని అనుకున్నాను అని చెప్పి వాళ్ళను స్వాగతించిన ప్రశాంతి, పరిశోధనా చూపుతో చూసింది.

అరవై ఏళ్ళ వృద్దుడు ఒకరు. ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు లోపు ఉన్న స్త్రీ, ముప్పైలలో ఒక మహిళ -- యాభై-యాభై ఐదు సంవత్సరాల వయసున్న ఒక ఆంగ్లో ఇండియన్ మహిళ.

ఆంగ్లో ఇండియన్ మహిళ మోకాలి వరకు నల్ల కోటు వేసుకోనుంది. మిగిలిన మహిళలు చీరలు కట్టుకుని దాని మీద స్వటర్వేసుకోనున్నారు. మగ మనిషి చాలా పాత ప్యాంటు -- శరీరానికి నల్ల రంగులో పూర్తిగా గుడ్డ కప్పుకున్నాడు .  దాన్ని స్వటర్అనీ చెప్పలేము, చొక్కా అని చెప్పలేము. రెండింటికీ మధ్య ఒకటి.

నలుగురిలో ఆంగ్లేయ మహిళ మాట్లాడటం మొదలు పెట్టింది.

హలో మ్యాడం...నా పేరు మేరీ జాన్. ఈమె సరసు, ఈమె మల్లి, ఇతను వెంకటస్వామి అని పరిచయం చేసింది.

వెంకటస్వామీ, మీరే తోటమాలా?”

అవునమ్మా

మీలొ ఎవరు వంట చేస్తారు?”

మల్లి ముందుకు వచ్చింది. ఆమె ముప్పై ఏళ్ళున్న మహిళ.

వణుకు పుట్టిస్తున్న చలిలో వచ్చారు. మొదట అందరికీ ఒక టీవేసి ఇవ్వు. నేను సహాయ పడతాను. తరువాత మాట్లాడుదాం

వంట గది చూపించింది. అక్కడున్న అలమరా తెరిచుండటాన్ని చూసి కొంచం విసుగ్గా చెప్పింది ప్రశాంతి.

నా పిల్లలు కొంచం అల్లరి పిల్లలు. చూడండి...అలమరాను తెరిచుంచి పరిగెత్తుకు వచ్చాశారు అని చెబుతూ పాల పౌడర్, టీ పొడి లాంటివి తీసి పెట్టింది.

అలమరా తెరిచుండటం చూసి  ప్రశాంతి కొంచం ఆలొచించి ఉండచ్చు! తానే ఎగిరి ఎగిరి మూసే అలమరా, తన పిల్లలకు ఎలా అందుతుందని...? ప్రొద్దుట్నుంచి వెలిగించబడని స్టవ్వుఇప్పుడు వెలుగుతున్నది... ఎలా? ఎవరు వెలిగించరు?  దానిపైన ఇదివరకే ఒక గిన్నెలో నీళ్ళు కాగుతున్నాయేఎందుకు? ఎవరు ఉంచారు?అని.  

బిస్కెట్ ప్యాకెట్టును ఒకటి చింపి ప్లేట్లో పెట్టి రాఘవ-గిరిజలను తినమని చెప్పి, మొదటి గదికి వచ్చింది ప్రశాంతి. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్న నలుగురు, ఆమెను చూసి మౌనం వహించారు.  

అక్కడ పులుముకున్న మౌనాన్ని చేధించింది ప్రశాంతి.

టీ తాగారా?”

తాగేం మ్యాడం

మిసస్ జాన్. మీరు టీచర్ కదా?”

అవును...టీచర్నే

పిల్లలిద్దర్నీ పిలుచుకు వచ్చి వాళ్ళ దగ్గర పరిచయం చేసింది.

మీకు తెలుగు తెలుసనే అనుకుంటున్నాను

బాగా తెలుసు

నా ఇద్దరు పిల్లలకూ పాఠాలు నేర్పించాలి. తెలుగు పాఠాలు నేనే నేర్పిస్తాను. వాళ్ళకు కావలసిన మిగిలిన పుస్తకాలన్నీ కొనుంచాను. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీ బాధ్యత

ఖచ్చితంగా మ్యాడం

నన్ను మీరు ' ప్రశాంతి ' అనే పిలవచ్చు

ఆమె దగ్గర స్నేహ పూర్వ నవ్వు నవ్వుతూ, వెంకటస్వామి వైపు తిరిగింది ప్రశాంతి......

మీకు పని. చెత్తంతా ఊడ్చి శుభ్రంగా ఉంచుకోవడం. పిల్లలిద్దరికీ డస్ట్ పడదు. ఆయసం వచ్చేస్తుంది. అందువలన వాళ్ళు తిరిగేచోట చాలా శుభ్రంగా ఉండాలి. కిటికీ తలుపులు తెరవక్కర్లేదు. వాకిలి తలుపు మూసే ఉంచండి. తరువాత వెంకటస్వామీ...ఇక్కడ పక్కన ఎక్కడన్నా పాలు, కూరలూ రోజూ కొనుక్కోగలమా చూడండి. బయటకు వెళ్ళే పనులను కొన్ని రోజులు మీరే చేయాలి. తరువాత కారు వస్తుంది

కొంచం ఆలోచనలో మునిగిపోయున్న ఆమె -- పిల్లల ఆటల శబ్ధం విని బయట పడింది. ఏదో సృతి తప్పినట్లు అనిపించిన ఆలొచనను పక్కకు నెట్టి, తాను మాట్లాడ దలుచుకున్నది మాట్లాడింది.

తరువాత...వెనుకవైపున్న అవుట్ హౌస్శుభ్రం చేసేసి మీరు అక్కడ ఉండండి. మల్లీ వంటకు కావలసిన వన్నీ ఉన్నాయి. సరసు ను నీ సహాయానికి ఉంచుకో. కాయగూరలు వచ్చేంత వరకు బఠానీలూ,వేరుసెనగ పప్పు -- ఇవన్నీ పెట్టుకుని అడ్జస్ట్ చెయ్యి. నువ్వూ, సరసు వంట గదికి పక్కనున్న గదిని శుభ్రం చేసుకుని ఉండండి. క్రింద డైనింగ్ హాల్పక్కనున్న ఇంకొక గదిని టీచర్ కు కేటాయించి ఇచ్చేయండి

సరేనని చెప్పి అక్కడ్నుంచి కదిలారు ఇద్దరు స్త్రీలు.

వెంకటస్వామి అప్పుడే తన పనిని చేయటం మొదలుపెట్టాడని వస్తున్న శబ్ధం బట్టి తెలుసుకుంది.

అక్కడున్న ఎర్ర డబ్బాలో వేసుంచిన గోధుమ రవ్వను వేయించి చేసిన ఉప్మాను, మూడు కొత్త ప్లేట్లలో పెట్టి, కొంచం పంచదారనూ ఉంచి డైనింగ్ హాల్ టేబుల్ మీద అందంగా పెట్టుంచింది సరసు. అది చూసి ప్రశాంతి బాగా తృప్తి చెందింది.

పనులుకు ఎవరెవరు కావాలో, పనివాళ్ళను పంపించినందుకు అమీలియా కు ఒక ఉత్తరం రాయాలి’ -- అని అనుకున్నది.

మామూలుగా పిల్లలిద్దరూ ఉప్మాని ఇష్టపడి తినరు. వేరే దారిలేక, ఏదైనా తినే కావాలని, మొహాన్ని చిట్లించుకున్న గిరిజను, రాఘవ్ నూ ఒత్తిడి చేసింది ప్రశాంతి. వాళ్ళు వేసుకోవలసిన మందులను వేసుకుని ఆ తరువాత ఆడుకోమన్నది.

మందు ఎందుకమ్మా?” అడిగింది సరసు.

వాళ్ళకు కొంచం ఒంట్లో బాగుండలేదు సరసు. అందుకనే

రోజూ వేసుకోవాలా?”

అవును

నాకు పిల్లలంటే చాలా ఇష్టమమ్మా. ఇంకమీదట పిల్లలను చూసుకోవలసిన బాధ్యతను నాకు అప్పగించండి

సరసు మాట్లాడిన తీరుతో ఆనందపడిన ప్రశాంతి సరే, నువ్వే చూసుకో అని సమ్మతం తెలిపింది........

తన ఉప్మా ప్లేటు ముందు కూర్చున్న ఆమె తినకుండా ఏదో ఆలొచిస్తోంది.తరువాత రెండు ముద్దలు మాత్రం తిని, టీ గ్లాసును తీసుకుని వచ్చి సోఫాలో వాలిపోయి, బయట  తెలుస్తున్న దృశ్యాలను చూడటం ప్రారంభించింది.

టీ తాగుతూ ఉన్నప్పుడు, వంట గదిలో నుండి మెల్లగా వచ్చిన ఒక గొలుసు శబ్ధం, హాలుకు వచ్చిన తరువాత స్విచ్ వేసినట్టు ఆగిపోయింది. సరసు గానీ, మల్లీ గానీ కాళ్ళకు వేసుకున్న గొలుసై ఉంటుంది అని అనుకున్న ప్రశాంతి -- దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  

కానీ, వాళ్ళిద్దరూ కాళ్ళ గొలుసులే వేసుకోలేదు. గొలుసు వేసుకున్న వ్యక్తే వేరుఅనేది ప్రశాంతి ఎప్పుడు గ్రహిస్తుంది?

వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు ప్రశాంతికు ఏర్పడ బోయే షాక్ ఎలా ఉంటుంది

************************************************PART-9**********************************************

పుల్లాయమ్మ కు భర్త తీసుకు వచ్చిన పది రూపాయల కాగితాలను చూడ చూడ ఆనందం పొంగి పొర్లింది. గ్రామంలో డబ్బుతో పెద్దగా అవసరంలేదు. చాలా వరకు సరకు మార్పడి వ్యాపారమే ఆచారం. ప్రొద్దున పాలు పితికి పోసేసి, కోడి గుడ్లు లెక్కపెట్టి ఇచ్చేసి, దానికి మార్పిడిగా షాపతని దగ్గర నుండి వారానికి ఒకసారి బియ్యం, పచారి సరకులు తీసుకు వస్తాడు.

పార్వతమ్మ ఇంటికి పోసే పాలుకు బదులుగా ఆమె తోటలోని చేమదుంప, క్యాబేజీ, క్యారెట్టు, బంగాళదుంప సీజన్ కు తగినట్టు కాయగూరలు వస్తాయి. ఇలా ఒక్కొక్కరూ సరకు మార్పడే  ఇస్తారు.  చేతికి చిల్ల గవ్వ ఇవ్వరు. కానీ అప్పుడప్పుడు, సమయం దొరికినప్పుడు, కూలీ పనికి వెళ్ళి రావటంతో వచ్చే డబ్బును  చేర్చి పెట్టి, ఆమె, ఆమె  భర్త రెండు సంవత్సరాలకు ఒకసారి ఎండాకాలం సెలవులప్పుడు తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆమె యొక్క అతిపెద్ద కోరిక అదే.   

రెండు పది రూపాయల నోట్లు, వాళ్ళ రెండు నెలల సేవింగ్స్.

ఇప్పుడైనా చెప్పు మామా...నీకెక్కడిది ఇంత డబ్బు?”

భార్య యొక్క సంతోషాన్ని చూస్తూ, నవ్వుతూ చెప్పాడు మన ఎర్ర ఇంటికి ఎవరో కొత్తగా అద్దెకు వచ్చారు. రోజూ పాలూ, కాయగూరలు, కోడిగుడ్లు ఇమ్మని అడిగారు

భర్త చెప్పిన ఆ మాటలు విని పుల్లాయమ్మ మొహంలోని సంతోషమంతా అనిగిపోయి సూదితో గుచ్చిన బలూన్ లాగా సన్నబడి పోయింది.

ఏం మావా... దయ్యాల కొంపకా అద్దెకు వచ్చారు? పోయిన వారం కూడా ఇంటివైపు వెళ్ళిన మన మంగమ్మ కొడుకు, అదే నండి రాజు గాడికి పూజారి మంత్రం వేసి పంపాడే. నీక్కూడ తెలుసు! నువ్వైనా ఇంటి గురించి ఆ ఇంట్లో వాళ్ళకు చెప్పకూడదా?”

చెప్ప కుండా ఉంటానా. చెబితే వినే రకంగా తెలియల. వాళ్ళకు ఇదంతా నమ్మకం లేదనుకుంటా. వాళ్ళింటి మగాడు మాట్లాడుతున్నప్పుడే, అమ్మ అటూ, ఇటూ వెళ్ళింది. వాళ్ళబ్బాయి ఒకచోట నిలబడకుండా అటూ, ఇటూ పరిగెత్తుతున్నాడు. చూడటానికి పాపం అనిపించింది. ఏం చేయగలం...కొంతమందికి పడితే గానీ తెలియదు

వాళ్ళు ఎలా తెలుసుకుంటారో మనకు వద్దు...వాళ్ళ డబ్బూ మనకు వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళి పాలు పొయద్దు

తానుగా వస్తున్న మహాలక్ష్మిని వద్దని చెప్పటానికి తయారైయ్యింది

సరే, పాలు పోయటానికి వెళ్ళను. డబ్బులకోసం నేను ఆశపడలేదు పుల్లాయమ్మా...చిన్న పిల్లలు ఉన్న ఇంటికి పాలు ఇవ్వను అని చెప్పటం తప్పు. నువ్వు పాలు పితికి కూజాలో పోసుంచు. అలాగే కూరగాయలు పెట్టు. బడ్డీ కొట్టు మూర్తి నగరానికి వెళ్తున్నప్పుడు బ్రెడ్ తీసుకు రమ్మని చెప్పు. అన్నిటినీ సంచీలో ఉంచు. వాళ్ళే ప్రొద్దున వచ్చి తీసుకు వెడతారు

పుల్లాయమ్మా చేతికి ఒక ఎవర్ సిల్వర్ కూజానూ, పసుపు సంచీనీ ఇచ్చాడు. అవి తీసుకుని  జాగ్రత్తగా ఉంచింది ఆమె.

కనక దుర్గమ్మ తల్లీ... కుటుంబానికి ఎలాంటి చావు రాకుండా చూసుకోమ్మా అంటూ మొహాలు తెలియని వారి కోసం ప్రార్ధన చేసుకున్నాడు.

ఎప్పుడూ మేఘాలతో ఉండే చోటు, ప్రశాంతికు ఇప్పటికి కొంచం అలవాటు అయ్యింది. తెల్లవారు జామా...లేక ఇంకా రాత్రేనా అనేది అంత సులభంగా చెప్పలేని సీతల వాతావరణం తన పని వాళ్ళ నడవడిక గురించి ప్రొద్దే  తెలిపింది.

నిద్ర రాక, మంచం మీద దొర్లి లేచి వస్తున్నప్పుడు ప్రొద్దుటి టిఫెన్ ను సరసు సహాయంతో మల్లి తయారు చేసి, అందంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుంది. వాటికి దగ్గరగా రంగు రంగుల గిన్నెలున్నాయి.

కానీ, ప్రశాంతికి నోట్లో పెట్టుకున్న ఏదీ లోపలకు పోక గొంతులోనే ఆగిపోతోంది. ఆమెకు మాత్రమే కాదు...పిల్లలకు కూడా ఆ తిండి నచ్చలేదు. రకరకాల వంటలతో తినే వాళ్ళకు ఉప్మానూ, బ్రెడ్ ముక్కలు తినటానికి విసుగ్గా ఉన్నది.

అమ్మ కోపానికి భయపడి ఒకటి రెండు ముద్దలు నోట్లోకి తోసేసి, తరువాత ఆడుకోవటం మొదలుపెట్టారు. పాత బంగళాను పరిశోధించటం వాళ్ళకు ఎంతో సంతోషం ఇచ్చింది. కొంచం సేపు చదువు. దాని కోసమే చాలా కథల పుస్తకాలు కొని పడేసింది ప్రశాంతి. పిల్లలుకూడా మేరీ టీచర్ సహాయంతో వాటిని ఆసక్తిగా చదివారు.

మధ్యాహ్నం భోజనంలో అన్నం,కూర,పులుసు, పచ్చడి అని ఉంటుంది. వాటిని పిల్లలు హాయిగా తిన్నారా? అనేది ప్రశాంతికి తెలియదు. ఎందుకంటే ఆమె అది పట్టించుకునే ఆలొచనే రాదు!

ఏదో డైనింగ్ టేబుల్ మీద పెట్టుంటారు -- వచ్చి కొంచం సేపు కూర్చుని -- తినింది చాలు అనిపించినప్పుడు లేచి వెళ్ళి పోతుంది.

సాయంత్రం పిల్లలు చదువుకోవాలి అనే విషయంలో ఖచ్చితంగా ఉండేది ప్రశాంతి. పిల్లలకు పాఠాలు చెబుతారు మేరీ టీచర్ మరియు ప్రశాంతి. వెంకటస్వామి కూడా పిల్లలకు ఏదైనా కథ చెబుతాడు. వయసైన ఆయన కాబట్టి పాత కోడైకానల్ ఎలా ఉండేది అనేది ఆసక్తిగా చెప్పేవాడు. తరువాత అందరూ వాళ్ళ వాళ్ళ గదికి వెళ్ళి పడుకుంటారు.

పిల్లలకు ఒక గది, వాళ్ళ గది పక్కనే ఉన్న గదిలో ప్రశాంతి ఉండేది. ఏదో కలలో నడుస్తున్నట్టు ఒక్కొక్క పని చేసి ముగించేది ఆమె.

రోజు గిరిజను పిలిచి, టేబుల్ మీదున్న పాలను తాగి వెళ్ళమని చెప్పింది. ఆటను వదిలేసి వచ్చిన గిరిజ, చూస్తూ ఉన్నప్పుడే ఆమె గ్లాసులో ఉన్న పాలు మొత్తాన్ని ఎవరో స్ట్రా వేసి పీల్చి తాగుతున్నట్టు పాలు గబగబ మని తగ్గిపోయింది. ఆశ్చర్యంతో నోట మాట రాక అలాగే నిలబడిపోయింది గిరిజ.

భయంతో మెల్లగా అమ్మా అని పిలిచింది.

పరిగెత్తుకొచ్చిన తల్లి పాలు తాగేశావా, సరే...సరే! గ్లాసు తీసుకు వెళ్ళి సింకులో పడేయ్ అని చెప్పేసి కదిలింది. గిరిజకు ఎలా చెప్పాలో...ఏం చెప్పాలో అని తెలియలేదు.

కొన్నిసార్లు డైనింగ్ హాలులో కూడా అలాగే జరుగుతుంది. పిల్లలకు వడ్డించిన ఆహార పధార్దాలను, కళ్ళకు తెలియని ఎవరో తినేసి వెళ్ళిపోతారు. ఎవరి దగ్గర చెప్పాలని అయోమయంలో పడ్డ పిల్లల్ను ఏదైనా ఆట చెప్పి వాళ్ళ ఆలొచనను మార్చేది సరసు.

ప్రశాంతి వీటిని దేనిని గమనించలేదు. గిరిజ అప్పుడప్పుడు చెప్పిన దానిని, ఆమెకు మామూలుగా చెప్పే కల్పిత కథే అనిపించింది.   

గదిలోని గాజు అద్దాల అలమరాలో పాత కాలపు రాజులు వేసుకునే దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి, అందంగా మడిచి పెట్టబడి ఉన్నాయి. అందులో నుంచి తలపాగా లాంటిది ఒకటి తీసి, తలకు తగిలించుకుని రాజ నడక వేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నది గిరిజ. ఎవరో మేడ మెట్లపై నుండి పరిగెత్తుకు వచ్చారు. ఎవరా అని చూసిన గిరిజకు అక్కడ పాతకాలపు దుస్తులు వేసుకున్న ఒక కుర్రాడు కనబడ్డాడు.

గిరిజా, నా బట్టలను ఎవరైనా వేసుకుంటే నాకు నచ్చదు. ఇక మీదట అవి తీయమోకు! వెళ్ళి అలమరాలో పెట్టేయిఅన్నఆ కుర్రాడు, గిరిజ తలపాగా తీసేసి అలమరాలో పెట్టేంత వరకు మౌనంగా నిలబడ్డాడు. ఆమె తలపాగా పెట్టేసి వెనక్కి తిరిగినప్పుడు, అతను కనిపించలేదు. జ్ఞాపకం వచ్చేసింది! ముందు గదిలో ఉంచబడ్డ రాజవంశ ఫోటోలలో కుర్రాడ్ని చూసున్నది గిరిజ.

అమ్మా అని అరిచిన గిరిజ దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు ప్రశాంతి, మేరీ. తడబడతూ జరిగింది చెప్పిన కూతుర్ను చూసి నవ్వింది.

నువ్వు చాలా ఊహించుకుంటున్నావు గిరిజా. పక్క గదిలో ఆడుకుంటున్న  రాఘవ్ కు కనబడనది నీకు కనబడిందా? నేను మేడ మీదున్న ముందు గదిలోనే కుర్చోనున్నాను. నువ్వు చెప్పినట్టు పిల్లడు మేడ మీద నుంచి వచ్చుంటే నేను చూసుండాలే! ఏదైనా ఊహించుకుని మనసు పాడుచేసుకోకుండా ఉండు

అమ్మను ఎలా నమ్మించేది?’ అనేది అర్ధం కాలేదు గిరిజకు. ప్రశాంతి వెళ్ళిపోవటంతో... గిరిజ బుర్రను వేడెక్కించింది మేరీ.

మీరూ నన్ను నామ్మటం లేదా టీచర్?”

నేను నిన్ను నమ్ముతున్నా గిరిజా. నేను కుర్రాడ్ని చూశాను

నిజంగానా? అమ్మకు మాత్రం ఎందుకు కనబడటం లేదు?”

జీవితంలో మనమందరం ఒక విధంగా దాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నామమ్మా. మన కంట్లో ఉండే కట్టు ఊడిపోయేంతవరకు, జరిగేదేమీ కనబడదు. మనకంటే ముందు వాళ్ళను చూసిన వారు నిజం చెప్పినా ఒప్పుకునే మనస్తత్వం చాలా మందికి లేదు. కళ్ళల్లోని కట్టు ఊడిపోయి పడిపోయిన తరువాతే మనకి నిజం తెలుస్తుంది. మీ అమ్మకూ అంతే. ఆమే తన కళ్ళతో చూస్తే గానీ నమ్మదు. కానీ, మీ అమ్మగారి కళ్ళు ఇప్పుడు కట్టబడి ఉన్నాయి. అవతలి వాళ్ళు చెప్పేదాన్ని ఒప్పుకునే మనో పరిస్థితి ఆమెకు లేదు

ఇది ఆమె ఎప్పుడు గ్రహిస్తుంది?”

అది తెలియదు. కానీ రోజు చాలా దూరంలో లేదనేది మాత్రం తెలుసు

************************************************PART-10*********************************************

కొన్ని రోజులు ప్రశాంతికి  కొంచం ఎక్కువగానే ఆకలేస్తుంది. కానీ, ఏదైనా నీరాహారం తాగిన వెంటనే ఆకలి అనిగిపోతుంది. కొన్ని రోజులైతే అసలు ఆకలే ఉండదు. లేక అలసటతో కొట్టి పడేసినట్టు బండ నిద్ర పోతుంది.మధ్య మధ్యలో శ్రీనివాస్ జ్ఞాపకాలు ఆమెను పీడిస్తుంది.

కొత్తగా బంగళాకు వచ్చేవారికి మొదట అలాగే ఉంటుంది అని మల్లి చెప్పింది. ఆమెకూ అలానే ఉండేదట...ఇక్కడ కొచ్చిన కొత్తల్లో ఆకలే ఉండేది కాదట. తరువాత చోటు అలవాటు అయిన తరువాత నుంచి తట్టుకోలేనంత ఆకలి  వేసేదట. ఒకేసారి ఆరేడు పండ్లు తినేదట. అప్పుడు కూడా ఆకలి తగ్గేది కాదట.

వెంకటస్వామి కూడా కొన్ని రోజులు ఆహారాన్ని ఆమెకే ఇచ్చేవాడట. చాలా రోజులుగా ఉన్న సమస్య, ప్రస్తుతం తీరిపోయిందని ఆమె చెప్పింది.

మీకైనా వంట చేసి పెట్టటానికి ఇంట్లో మనిషి ఉంది. నాకు అలా కాదు. చోటుకు వచ్చినప్పుడు తెలిసిన వారు ఎవరూ లేరు. ఆలయంలో అప్పుడప్పుడు ఇచ్చే భోజనాన్ని తిన్నాను అన్నది మేరీ.

నేనే అడగాలనుకున్నాను. మీరందరూ ఎలా స్నేహితులు అయ్యారు. ఎవరికీ ఒక చిన్న సంబంధం కూడా లేదే?”  అని అడిగేసి వాళ్ళు ఎక్కువసేపు మౌనంగా ఉండటంతో ఏదైనా తప్పుగా అడిగేశానా?’ అని వెనక్కి తిరిగింది ప్రశాంతి. వాళ్ళందరూ ఏదైనా అనాధ ఆశ్రమం నుండి వచ్చుండచ్చు. తాను అలా అడిగింది వాళ్ళ మనసును బాధ పెట్టుంటుందిఅనుకుని పశ్చాతాపంతో తప్పుగా అడుగుంటే క్షమించండిఅన్నది.

తప్పే లేదమ్మా. మహాబలేశ్వర్ లో పుట్టిన గోదావరి ఆంధ్రా వచ్చి సముద్రంలో కలవటం లేదా? అదేలాగా ఆదరించే వాళ్ళే లేని వేరు వేరు చోట్ల నుంచి పనికోసం ఇక్కడికి వచ్చిన మాకు, ఒకే చోట ఉండి పనిచేసే అవకాశం వచ్చింది. అలా స్నేహితులయ్యాము

ఆదరించే వాళ్ళే లేని మేము...అని మేరీ చెప్పింది ప్రశాంతి మనసును వేధించింది. ఇంక మీదట వాళ్ళను ఏమీ అడగకూడదు అని నిర్ణయించుకుని ...వేరే విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది.

పిల్లలు టాబ్లెట్లు ఇంకా వేసుకోలేదనే విషయాన్ని వాళ్ళ మూలం తెలుసుకున్న ప్రశాంతి, సరసు ను పిలిచి విచారించింది.

మాత్రలు అయిపోయినై అమ్మా

నా దగ్గర అడిగి తీసుకోనుండచ్చు కదా?”

లేదమ్మా! నిన్న కూడా మాత్ర ఇవ్వలేదు. ఇద్దరూ బాగానే ఉన్నారు. అందుకనే మీ దగ్గర చెప్పలేదు

సరసు చెప్పిన తరువాతే తనకి రోజూ వచ్చే తలనొప్పి కొద్ది రోజులుగా రాలేదనేది ప్రశాంతి జ్ఞాపకానికి వచ్చింది. అయినా కూడా పిల్లల విషయంలో ఆమె మెతకగా ఉండటం ఇష్టపడలేదు.

పరవాలేదు...కానీ, మాత్రలు ఆపద్దు. ఖాలీ సీసా తీసుకురా, మాత్రలు నింపి ఇస్తాను అని చెబుతూ గదిలోకి వెళ్ళింది.

ప్రశాంతి, కళ్ళ నుండి కనిపించకుండా వెళ్ళిన తరువాత, మాత్ర బాటిల్ తీసిన సరసు -- అందులో ఉన్న, ఇంకా కొంచం కూడా తగ్గని మాత్రలను తీసి అలాగే పారేసింది. 

ఇంటి పరిస్థితిలో కొంచం కొంచం మార్పు రావటం మొదలయ్యింది. అయోమయంలో ఉన్న ప్రశాంతికి ఏదీ తెలియలేదు. దాన్ని మొదటిగా కనిపెట్టిందేమో గిరిజనే. ప్రశాంతి దానిని పూర్తిగా గ్రహించే లోపు అన్నీ చేతులు దాటి పోయాయి.

రోజు పిల్లలిద్దర్నీ ఒంటరిగా వేరు వేరు గదుల్లో కూర్చోబెట్టి, లెక్కలు ఇచ్చేసి లైబ్రరీలో వచ్చి కూర్చుంది. అప్పుడు గాజు వస్తువు ఒకటి విరిగే శబ్ధం విన్నది.

దాంతో పాటూ ఎవరో అని అరిచిన శబ్ధము. పడిపోయే పరిస్థితిలో ఉన్న పాత గాజు లైటు క్యాండిల్స్, ఒంటరిగా కూర్చుని చదువుతున్న పిల్లలను గుర్తుకు తెచ్చుకుని, వేగంగా పరిగెత్తింది. క్రింద కూర్చుని ప్రశాంతంగా చదువుకుంటున్నాడు రాఘవ్.

గిరిజా... అని పిలుస్తూ మేడమీదకు వేగంగా వెళ్ళింది.

ఏమైంది గిరిజా, అరిచావా?”

లేదే!

అమ్మ దగ్గర అబద్దం చెప్ప కూడదు. ఇప్పుడు నిజం చెప్పు

నేను అరవలేదు. కానీ అరిచింది ఎవరో నాకు తెలుసు

సరే...ఎవరు?”

పిల్లాడే

ఎవరు? రోజేమో రాజాలాగా దుస్తులు వేసుకుని వచ్చాడని చెప్పావే...వాడా?” ఎగతాలిగా అడిగింది.

ఏది చెప్పినా తన తల్లి నమ్మబోయేది లేదు అనే ఆలొచనలో, వేరే విధంగా చెప్పింది.

లేదు...ఇతను వేరు

గిరిజను నమ్మకుండా చూసిన ప్రశాంతి, “దేనికి అబ్బాయి అరుస్తున్నాడు? అది కూడా చెప్పు...విందాం

వాడికి ఇల్లు నచ్చలేదట. అందరం వాడిని విసిగిస్తున్నామట. ఒకటి వాడు వేరే చోటుకు వెళ్ళాలట, లేదు మనం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలట. అరుస్తూ ఫోటోలన్నిటినీ విరక్కొట్టాడు

గిరిజ చూపించిన చోట నాలుగైదు ఫోటోలను ఎవరో కింద పడేసి విరకొట్టారు.  

************************************************PART-11*********************************************

ప్రశాంతి, పిల్లలూ 'ప్రశాంతి నిలయం'కు వచ్చి ఒక వారం పైనే అయ్యింది. రోజు ఆమెకు నచ్చిన వంటను చేసి వడ్డించి ఆమెను ఆశ్చర్యపరిచింది మల్లి. అక్కడకు వచ్చిన తరువాత ప్రశాంతి ఒక్క పూట కూడా సరిగ్గా తినలేదు. ప్రొద్దున లేచిన దగ్గర నుంచే ప్రశాంతికి  మంచి ఆకలి. దానికి తగినట్లు వంట  బ్రహ్మాండంగా ఉంది. చాలా రోజుల తరువాత ముగ్గురూ కడుపు నిండుగా లాగించారు. ఆనందంగా ఆడుకున్నారు. ముగ్గురికీ పొద్దున నుండి మారి మారి శ్రీనివాస్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

నాన్న మనల్ని తలుచుకుంటారా అమ్మా? మనం ఇక్కడున్నది ఆయనకు తెలుసా? అయితే ఎందుకు ఇంకా మనల్ని చూడటానికి రాలేదు?” అని పిల్లలు అడిగే ప్రశ్నలకు విలవిలలాడిపోయింది తల్లి

సమాధానమెదురు చూసి కాచుకోనున్న పిల్లల దగ్గర, “ఖచ్చితంగా మీ నాన్న మిమ్మల్ని చూడటానికి వస్తారు. ఇప్పుడు మీకు ఇష్టమైన పాయాసం ఇదిగో అని చెప్పి, వేరే కథలను మాట్లాడటం ప్రారంభించారు మల్లీ, సరసు.

ఇక్కడకు వచిన ఎవరూ ప్రశాంతి దగ్గర, ఆమె భర్త గురించి ఒక్క మాట అడగలేదు. నాగరీకం తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉన్న గుణం, హైదరాబాదులో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండుంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని అనాధలాగా చోటు మారి వచ్చేది కాదు.

పెళ్ళికి ముందు శ్రీనివాస్ ని చాలా ఇష్టపడింది ప్రశాంతి. శ్రీనివాస్, ప్రశాంతి మేనమామ కొడుకు. కానీ, అతను ప్రశాంతిని ఇష్టపడలేదు. అతనికి ఎందుకో ప్రశాంతి యొక్క తండ్రి -- అంటే కొంచం కూడా ఇష్టం ఉండదు. అత్తయ్యను చూడటానికి మాత్రం మాటి మాటికి ప్రశాంతి ఇంటికి వచ్చి వెడతాడు. తన అమ్మమ్మ వేసే దూపం వలన, మేనమామ ఇచ్చిన వాగ్ధానం వలన ప్రశాంతికి శ్రీనివాస్ మీద ఉండే ప్రేమ మూడు కాయలూ, ఆరు పండ్లు లాగా రంగురంగులుగా మారటానికి కారణమయ్యింది.     

ప్రశాంతి తండ్రి మార్తాండ చక్రవర్తికి సినిమా మనుషులతో సంబంధం ఉన్నందువలన, అప్పుడప్పు డు ఆయన్ని చూడటానికి కలల ప్రపంచానికి చెందిన చాలా మంది డబ్బుకొసం వచ్చి వెడుతుంటారు. మార్తాండ చక్రవర్తి మాట సహయం చేస్తే తన కూతురు, సినిమాలలో సహనటిగా నటిస్తున్న స్నేహలత తల్లి -- తన కూతురు స్నేహలతకి ఒక హీరోయిన్ ఛాన్స్ ఇప్పించమని మార్తాండ చక్రవర్తిని బ్రతిమిలాడి అడిగింది. కానీ చూద్దాంఅని చెప్పి పంపించారు చక్రవర్తి గారు. తల్లితో పాటూ వచ్చిన స్నేహలత కళ్ళు మాత్రం అక్కడ దూరంగా, తన అత్తతో మాట్లాడుతున్న శ్రీనివాస్ చుట్టూ తిరిగింది.   

చాలా సేపు తనని ఎవరో గమనిస్తున్నారని ఊహించిన శ్రీనివాస్, కళ్ళతోనే తనను ఆరాధించిన అమ్మాయిపైన చూపులు పెట్టాడు. ఏమీటీ?’ అంటూ కురులు పైకెత్తి అడిగిన అతన్ని చూసి సిగ్గుతో తలవంచుకుంది అమ్మాయిశ్రీనివాస్ కి ఆశ్చర్యం. అతన్ని చూసి ఎవరూ సిగ్గుపడింది లేదు. అతని మేనమామ కూతురు ప్రశాంతి కూడా తలెత్తుకుని నడవటం, తిన్నగా శ్రీనివాస్ కళ్ళల్లోకి చూడటం చేస్తుంది. 

అతను గనుక ఇలా ప్రశాంతిని చూసుంటే ఆమె తటపటాయించకుండా, ‘ఏమిటి బావా మీకు ఏం కావాలి?’ అని అడుగుంటుందే తప్ప, ఇలా సిగ్గుపడి నిలబడదు.

తన కూతుర్ని చూసి ఆనందపడుతున్న శ్రీనివాస్ ని చూసిన స్నేహలత తల్లి ఒక క్లియర్ లెక్క వేసింది.

తమ్ముడు, అయ్యగారి అల్లుడే కదా?” అని అడిగి క్లియర్ చేసుకున్న ఆమె బాగున్నారా? వారం మా స్నేహలత యొక్క నాట్య ప్రోగ్రాం ఉన్నది మీరు తప్పకుండా రావలి అని శ్రీనివాస్ దగ్గర అభ్యర్ధన పెట్టింది.

స్నేహలత తల్లి యొక్క మనోలెక్క ఖచ్చితంగా ఫలించింది. శ్రీనివాస్, స్నేహలత చాలా చోట్ల కలుసుకోవటం మొదలుపెట్టారు. ప్రశాంతికి విషయం తెలియటంతో... రోజే ఆమె మొట్ట మొదటిసారిగా ఏడ్చింది. 

నీ బావ పెద్ద మత్తులో ఉన్నాడు. అతన్ని కాపాడటం కష్టం -- అన్నాడు తండ్రి మార్తాండ చక్రవర్తి.

ప్రశాంతీ, పెళ్ళి విషయంలో మాత్రం -- ఇష్టంలేని వాళ్ళను బలవంతం చేయకూడదు. అలా చేస్తే మీ ఇద్దరి జీవితం అతకదు. శ్రీనివాస్ అతని మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోనీ"  -- అన్నది తల్లి  కుమారి.

"అతని మనసుకు నచ్చింది బంగారంగా ఉంటే పరవాలేదు! నేనే పెళ్ళి చేసే వాడిని. అది కనీసం బంగరు రేకు కూడా కాదు. ఇనుప రేకు. ఎలా పెళ్ళి చేయను?" అన్నాడు మార్తాండ చక్రవర్తి. 

ఇది అతని జీవిత సమస్య. అతనే ఒక నిర్ణయానికి రావాలి

నాన్నా, నేను బావను చాలా ఇష్టపడుతున్నాను. బావను వదిలేసి నేను  ఉండలేను. నాకు ఎలాగైనా బావను ఇచ్చి పెళ్ళి చేయండి అన్న ప్రశాంతి యొక్క దృఢమైన మాటలు అక్కడ చివరగా గౌరవించ బడ్డాయి.

స్నేహలతకి హిందీ సినిమాలో పిలుపురాగా, ఆమె శ్రీనివాస్ ను తప్పించుకోవటం మొదలుపెట్టింది. మనో భారంతో ఉన్న అతను, ఆరొగ్యం క్షీణించిన బామ్మ మాటకు కట్టుబడి పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు.  

కానీ, ప్రశాంతి తనకు వద్దని చెప్పాడు. సొంత వారిని పెళ్ళి చేసుకోవటం మంచిది కాదన్నాడు. దానికి కారణం కూడా చెప్పాడు. పుట్టే పిల్లలకు అంగవైకల్యం ఏర్పడటానికి అవకాశం ఉందన్నాడు.

కానీ, శ్రీనివాస్ తండ్రి సత్యాగ్రహం చేసి ప్రశాంతికి, శ్రీనివాస్ కూ పెళ్ళి చేసారు.

పై చదువులు కారణం చూపి ఇద్దరినీ ఇంగ్లాండ్ కు పంపారు మార్తాండ చక్రవర్తి. బయలుదేరే ముందు తన కూతురితో ఒంటరిగా మాట్లాడాడు.

ప్రశాంతీ తల్లీ! చాలా కష్టపడి స్నేహలతకి హిందీ సినిమాలో నటించటానికి ఛాన్స్ ఇప్పించి, ఆమెను నీ భర్త దగ్గర నుండి వేరు చేశాను. దీనికి పూర్తిగా ముప్పై లక్షలు ఖర్చు అయ్యింది. కాబట్టి, నువ్వెళ్ళే చోటునే - అంటే లండన్ లోనే పిల్లా పాపలతో సెటిల్ అయిపో. స్నేహలత, వాళ్ళ అమ్మ చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళ వలన నీకు రోజైనా ఆపద రావచ్చు. అల్లుడి మనసులో చోటు పట్టుకోవటం మాత్రమే నువ్వు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాటానికి ఒకేదారిఅని చెప్పి వాళ్ళను లండన్ కు పంపించాడు.

ఇంగ్లాండుకు వెళ్ళిన వెంటనే పై చదువుకు యూనివర్సిటీలో చేరాడు శ్రీనివాస్. ఇంటి నిర్వాహం చూసుకుంటూ, పక్కనే ఉన్న ఒక ఆఫీసులో ఉద్యోగం వెతుక్కుంది ప్రశాంతీ.

వొళ్ళు హూనమయ్యేటట్టు పనిచేసి, ఎక్కువ డబ్బు సంపాదించి సంపాదనతో శ్రీనివాస్ కు ఒక ఖరీదైన, కొత్త డిజైన్ డ్రస్సు కొనిచ్చింది.

పచ్చ రంగు చీరలో దేవతలా కనిపించిన ఆమె దగ్గరకు ఆశగా చేరుకున్నాడు. పసుపుతాడు మంత్రం, శ్రీనివాస్ దగ్గర పనిచేయటం మొదలుపెట్టింది. నది అక్కడ సముద్రంలో కలిసింది. స్నేహలత చూపిన మాయ అంతా  కనుమరుగయ్యిందిఅంటూ తప్పుడు లెక్క వేసుకుని కుతూహలమయ్యింది ప్రశాంతీ యొక్క ప్రేమ మనసు.

సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో మొదటి తుఫాన మొదలయ్యింది. గిరిజకు ఆయసం వచ్చింది. దగ్గర బంధుత్వంలో పెళ్ళి. అందుకనే వద్దని చెప్పానుఅన్న భర్తను ఎలాగో సమాధానపరిచి, సాగించిన జీవితంలో రెండోవాడుగా పుట్టిన రాఘవ్ కు కూడా అదే ఆరొగ్య సమస్య వచ్చింది. ఇది వారసత్వ సమస్యేఅని చెప్పింది మందుల ప్రపంచం.

మందులు రెగులర్ గా వాడితే పరిస్థితి కట్టుబాటులో ఉంటుంది అని వివరణ ఇచ్చింది. ఇది శ్రీనివాస్ యొక్క వాదనకు మరింత బలం చేకూర్చింది -- దీని వలన అతనికీ, ప్రశాంతీకి మనసులో బీట్లు పడటం మొదలయ్యింది. అప్పుడే ప్రశాంతీ తప్పు చేసింది. శ్రీనివాస్ మాటలు విని అతనితో పాటూ ఇండియాకు వచ్చింది. స్నేహలత కూడా వాళ్ళ జీవితంలోకి మళ్ళీ జొరబడింది.

తన గ్లామర్ను మాత్రమే నమ్ముకున్న స్నేహలత, పోటీ నిండిన హిందీ సినీ ప్రపంచంలో విజయం సాధించలేకపోయింది. తెలుగులోనూ తనకున్న స్థానాన్ని పోగొట్టుకుంది. కనుక గ్లామర్ కలిగిన -- రెండు, లేక మూడవ హీరోయిన్ గానూ, విల్లీగానూ నటించటం మొదలు పెట్టింది

పరిస్థితుల్లో ఒక ఫంక్షన్ లో తిరిగి శ్రీనివాస్ ను కలిసింది స్నేహలత. అతని యొక్క ప్రస్తుత అంతస్తు, డబ్బు, ఊర్లో అతనికున్న మర్యాద ఆమెను ఆశ్చర్యపరిచింది. తల్లి మాట విని అతన్ని వదులుకున్నది మూర్ఖత్వంగా భావించింది. శ్రీనివాస్ తో కలిసి నిలబడ్డ ప్రశాంతీని చూసి ఈర్ష్య పడింది. తన  జీవితాన్ని ప్రశాంతీ కైవసం చేసుకుందని విసుగు పడ్డది.    

స్నేహలత అతన్ని పెళ్ళి చేసుకోనుంటే, శ్రీనివాస్ ఎక్కడో ఒక గుమాస్తా గానే  ఉండేవాడని మూర్ఖత్వ మహిళకు అనిపించలేదు.

ఎప్పుడైనా సరే తెలివిగల వాడితో యుద్దం చేస్తే అది ఎంతో గౌరవంగా ఉంటుంది. మూర్ఖులు నిజంగా ప్రమాదకరమైన వాళ్ళు. స్నేహలత కూడా గుంపులో ఒకత్తే. ఆమె బుర్ర దొడ్డి దోవలోనే పనిచేసింది.

శ్రీనివాస్ ని వెంబడించి వెళ్ళి అతన్ని కలిసిన ఆమె -- అతన్ని వద్దన్నందుకు ఒక పెద్ద కారణం చెప్పింది. ఆ కారణం శ్రీనివాస్, ప్రశాంతి ని విడిచి స్నేహలతని పెళ్ళి  చేసుకోవాలనేంత శక్తి కలిగినిదిగా ఉన్నది

************************************************PART-12********************************************* 

పిల్లలను గమనిస్తూ వాళ్ళ ఆరొగ్యాన్ని మెరుగు పరిచి ప్రశాంతి ఒక పరిస్థితికి  వచ్చినప్పుడు, తన జీవితంపై శ్రద్ద పెట్టటం మొదలుపెట్టింది. అప్పుడు తెలిసింది పరిస్థితి చైదాటి పోయిందని. సగం రోజులు తన భర్త, స్నేహలతతో ఊరంతా తిరిగి ఇంటికి వస్తున్నది అర్ధం చేసుకుంది.

అలాగే వదిలేయటానికి మనసులేని ప్రశాంతి, ఒక రోజు మేలుకుని భర్తను నిలదీసింది.

నన్ను పెళ్ళి చేసుకోవటానికి నువ్వు చేసిన కుట్ర నాకు తెలిసిపోయింది-- విసుగు నిండిన స్వరంతో చెప్పాడు శ్రీనివాస్.

షాకై నిలబడ్డ ప్రశాంతితో, “నువ్వు అలా నడుచుకుంటావని నేను అనుకోలేదు. నీ మీద మంచి అభిప్రాయం పెట్టుకున్నా

... స్నేహలతని వదిలించుకోవటానికి నాన్న ముప్పై లక్షలు డబ్బు ఖర్చుపెట్టి, ఆమెను శ్రీనివాస్ దగ్గర నుండి వేరుచేసింది శ్రీనివాస్ దగ్గర చెప్పుంటుందని అనుకుంటా. అదే కోపం’ 

స్నేహలత ఏమి చెప్పుంటుందో కూడా తెలియని ప్రశాంతి మాటలను జార్చింది. 

ప్రేమకూ, యుద్దాలకూ ఇరువైపులా న్యాయం ఉన్నట్టు చెబుతారు అని మెల్లగా చెప్పింది...అది అతని కోపాన్ని ఇంకొంచం ఎక్కువ చేస్తుందని తెలియక.

ప్రశాంతి కాదని చెప్పి -- తన యొక్క వివరణ చెబుతుంది, బ్రతిమిలాడుతుంది అని అనుకున్న శ్రీనివాస్ కు ఆమె యొక్క జవాబు అతని కోపాన్ని తలకెక్కేటట్టు చేసింది. పెద్ద తప్పు చేసేసి, తాను చేసింది కరెక్టే నని వాదించే వాదనను అతను అంగీకరించలేకపోయాడు. 

ఉండచ్చు! దానికోసం నువ్వు ఇంత దిగజారి నడుచుకుంటావని అనుకోలేదు. ... టేబుల్ పైన బలంగా గుద్ది, ప్రశాంతి వైపు తిరిగి అది సరే, స్నేహితుని చెల్లి పెళ్ళి నిశ్చయ తాంబూళాలకు వెళ్ళి, అమ్మాయినే పెళ్ళిచేసుకున్న ఆయనే కదా మీ నాన్న. అలాంటి ఆయన కూతురైన నీ దగ్గర మంచి గుణాన్ని ఎదురు చూడటం నా తప్పే అన్నాడు.

తల్లీ-తండ్రి బాంధవ్యం ఎప్పుడూ ఒక తామర లేని నీళ్ళు లాగానే ఉంటోందని అనుకుంటూ వచ్చింది ప్రశాంతి. దానికి ఇదే కారణమా? తల్లి-తండ్రి గురించి కొత్తగా తెలిసిన విషయాన్ని విన్న ప్రశాంతికి షాక్ తగిలినట్లు అయ్యింది.

దాన్ని పట్టించుకోని శ్రీనివాస్ మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టాడు.  

సొంతవాళ్ళ మధ్యలో మీ నాన్న మాట్లాడిన తప్పుడు మాటల వల్ల మాకు చెడ్డపేరు. వేరే దారిలేక సొంత ఊరు వదిలేసి కుటుంబమంతా ఇక్కడకు వచ్చాశాము. నిన్ను పెళ్ళి చేసుకోవడం కూడా నాకు నచ్చలేదు. అత్తయ్య అడిగింది కదా నని మాత్రమే అంగీకరించాను. కానీ, నువ్వూ, నీ తండ్రి ఎంత నీచంగా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు?”

ఏం చెబుతున్నారు? స్నేహలత డబ్బుకొసమూ, హింది సినిమాలో నటించటం కోసమూ మిమ్మల్ని వదిలేసి పారిపోయింది. డబ్బును చూసి పరిగెత్తిన ఆమె కంటే, తన కూతురు ఆశపడ్డ వాడినే పెళ్ళి చేసి ఇవ్వటానికి ప్రయత్నించిన మా నాన్న మీకు చెడ్డవారు అయిపోయారా?”

ఇది నేను నమ్మాలా? మీ నాన్న నన్ను కొంచంగా బ్రతిమిలాడుంటే కూడా పెళ్ళికి ఒప్పుకునే వాడిని. అది చెయ్యటానికి మీ రాజవంశానికి కుదురుతుందా? మనుషులను పంపి ఆమెను మిగిలిన మగవారితో దగ్గరగా ఉన్నట్టు ఫోటో తీసి బెదిరించారు.

బెదిరింపుకు భయపడిపోయి స్నేహలత వాళ్ళ అమ్మతో కలిసి ఊరు వదిలే వెళ్ళిపోయింది. సమయంలో నిన్ను నాకు ఇచ్చి పెళ్ళి చేశేసి మనల్ని దేశం నుండే పంపించారు. ఏమి గొప్ప రాజతంత్రం?”

మళ్ళీ విసుగ్గానే చెప్పాడు.

అర్ధం కాకుండా, ఏమీ తెలియనట్లు అతన్ని చూసింది.

అతని దగ్గర స్నేహలత అబద్ధం చెప్పింది. నటిని నమ్ముతున్న అతను, తన భార్యను నమ్మటానికి రెడీగా లేడునిజం చెప్పాల్సిన ఆమె తండ్రీ, మామగారు ఇప్పుడు తిరిగి రాలేని లోకంలో ఉన్నారు!

ఇతనికి ఎలా అర్ధం అయ్యేటట్టు చేసేది?’ అంటూ ఆలోచించింది ఆమె.

ఒకటి మాత్రం ఖచ్చితం ప్రశాంతీ. నిజం తెలిసినప్పటి నుండి నిన్ను చూడటానికే నాకు నచ్చలేదు. నన్ను ప్రేమించిన పాపానికి -- తన జీవితాన్ని పోగొట్టుకున్న స్నేహలతకి న్యాయం చేయటానికి -- నిన్ను విడిచి పెట్టటమే ఒకే దారి అనుకుంటున్నా" అంటూ విడిపోవటం గురించి మాట్లాడేసి -- రోజు రాత్రే ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లల తండ్రి.

దంపతుల ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను తెలుసుకున్న స్నేహలత, శ్రీనివాస్ తో కలిసి పలు చోట్ల తిరిగింది. పెద్ద రాజ కుటుంబంలో ఒక నటి యొక్క చొరబాటు పత్రికలు పెద్దవి చేసినై. ప్రశాంతికి శిక్ష వేస్తునట్టు అనుకుని విడాకుల పత్రం పంపించాడు అతను.

మనో కష్టంతో కృంగిపోయిన ప్రశాంతి, దాని తరువాతే ఎవరి కంటికి కనబడకుండా పిల్లలతో పాటూ ప్రశాంతి నిలయంకు వచ్చింది. ఆమె దగ్గర విడాకులు  తీసుకోకుండా, శ్రీనివాస్ స్నేహలతని పెళ్ళి చేసుకోవటం కుదరదు. ఆమె ఉండే చోటు తెలిస్తేనే కదా విడాకుల సమస్య పెద్దదవుతుంది.

'ఇక దానికి దారే లేదు ' అనే అనుకుంది ప్రశాంతి

************************************************PART-13*********************************************

స్నానం చేసేసి, పంపు తిప్పకుండా వెళ్ళిపోయిన పిల్లలపైన ప్రశాంతికి కోపం వచ్చింది.

ఏమిటంత బాధ్యత లేని తనం మీకు...?” అని తిట్టుకుంటూ పిల్లల గదిలోకి వెళ్ళిన ప్రశాంతికి అక్కడ కిటికీకి దగ్గరగా ఉన్న గిరిజ మంచంపైన ఆమె గొంతును చుట్టుకుని రాఘవ్ నిద్రపోతున్నది చూసింది. 

ఇద్దరూ ఇంకా లేవలేదు, అలాగైతే స్నానాల గది పంపును ఎవరు తెరిచుంటారు?’

ఆలొచిస్తున్నప్పుడే స్నానాల గది తలుపులు దఢేల్అనే శబ్ధంతో మూసుకున్నాయి. పంపును ఎవరో తిప్పుతున్న శబ్ధం. సన్నని గొంతుకతో పాటపాడుతున్న శబ్ధమూ వినబడింది.

ఎవరై ఉంటారు?’… ఆలొచన ఆమె బుర్రను తినేస్తోంది.

అమ్మా అన్న రాఘవ్ కేక ఆమె ఆలొచనలను చెదరగొట్టింది.

ఏమిటి రాఘవ్... నువ్వెందుకు గిరిజ బెడ్ మీదకు వచ్చి పడుకున్నావు?”

రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎవరో నన్ను తిట్టేసి కిందకు తొసేశారమ్మా. నాకు భయం అనిపించింది. అందుకనే అక్కయ్య దగ్గరకు వచ్చి పడుకున్నాను అన్నాడు.

లోపు నిద్ర లేచిన గిరిజ నేను నిన్ననే చెప్పాను కదా. అది వాడి బెడ్. అక్కడ పడుకుంటే వాడొచ్చి నిన్ను కిందకు తొసేస్తాడని. నువ్వు వినలేదు. ఇక వాడి జోలికి వెళ్ళకు...నాతోనే పడుకో

ఎవరమ్మా వాడు?”

వాడేనమ్మా... రామ్. వాడితో పెద్ద గోల అయిపోయింది. బొమ్మను తీస్తే తిడుతున్నాడు. నేను కాగితం మీద రాస్తే, లాక్కుని అవతల పారేస్తున్నాడు. నాకు వాడంటనే నచ్చలేదమ్మా

గిరిజ చెప్పిందాంట్లో ఎంత నిజం ఉందో తెలియని తల్లి ఆశ్చర్య పడుతుండ --- స్నానాల గది తలుపు తానుగా తెరుచుకుని తరువాత వేగంగా మూసుకుంది.

మామగారి స్నేహితుడు రహీం బాయ్ వచ్చి వెళ్ళిన తరువాత నుండి శ్రీనివాస్, స్నేహలతను కలవకుండా తప్పుకోవటం చేస్తూ, భార్యను కష్టపెట్టినందుకు బాధ పడుతూ, తాగుడు మొదలుపెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు.

గడ్డం గీసుకోని మొహంతో కుర్చీలో కూర్చుని ఎదురుకుండా ఉన్న గోడమీద వేలాడుతున్న పెద్ద ఫోటోను తదేకంగా చూస్తున్నాడు శ్రీనివాస్. ఎదురుగా ఉన్న ఫోటోలో రాజుగారూ, శ్రీనివాస్ తమ పిల్లల్ని దగ్గరకు చేర్చుకుని నవ్వుతూ ఉన్నారు.

భార్యా, పిల్లలు తనని విడిచి వెళ్ళి పలు సంవత్సరాలు అవుతున్న ఫీలింగ్. టెలిఫోన్ పిలుపులకు సమాధానం చెప్పలేక తనని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలని, టెలిఫోన్ వయర్ ను పీకేసి మేడ మీద కూర్చున్నాడు.

ఎవరో గదిలోపలకు వచ్చారు. సెంటువాసన ముక్కును జలదరింప చేసింది. వాసనే, వచ్చేది ఎవరని చెప్పకుండా చెప్పింది! మంచం మీదున్న ఫోటోలు అన్నీ అతని మనో పరిస్థితిని ఎత్తి చూపింది స్నేహలతకి. అయినా కానీ సంధర్భాన్ని వదిలిపెట్టటానికి ఆమెకు మనసే లేదు.

మీరు బాధలో ఉంటారని తెలుసు. అందుకనే మీకు తోడుగా ఉందామని వచ్చాను అన్న ఆమెను, జవాబు చెప్పకుండా గుచ్చి చేశాడు. ఈమే, ఈమే పధకం వేసి తనని తన కుటుంబం నుంచి వేరు చేసింది. ఒక నటి చెప్పింది కాబట్టి, ఇంత కాలంగా భార్యా, పిల్లలూ అంటూ ఉత్సాహంగా కుటుంబాన్ని నడిపిన నాకు బుద్ది ఎక్కడికి వెళ్ళింది?’

అతని మనసులో ఏర్పడిన అయోమయం ఏమిటో తెలుసుకోకుండా ప్రశాంతిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది స్నేహలత. విడాకుల పత్రంలో ఒక సంతకం పెట్టుంటే ఇప్పుడు నేను కష్టపడుతూ ఉండక్కర్లేదు కదా? పాటికి శ్రీనివాస్ యొక్క భార్య అయ్యుండేదాన్ని...బోలేడు ఆస్తికి యజమానిని అయ్యేదాన్ని

ఏది ఏమైనా అది ఇలా చేసుండకూడదు

ఎవరది?”

అదేనండీ... ప్రశాంతీనే. చూడండి మీకు ఇప్పుడు ఎంత చెడ్డ పేరు, మనసు కష్టం. కన్ ఫ్యూజన్ అంతా తీరడానికి, మనిద్దరం పెళ్ళి తరువాత మళ్ళీ లండన్ కే వెళ్ళిపోదాం.......లేని కన్నీటిని తుడుచుకుంది.

స్నేహలతా... అని గట్టిగా అరిచి ఒకటి బాగా గుర్తుంచుకో ...నువ్వంతా అది...ఇదిఅని మాట్లాడేంత దిగజారిపోలేదు నా భార్య ప్రశాంతి. ఆమె ఇంకా నా భార్యే. నా బిడ్డలకు తల్లే. రాజా మార్తాండ చక్రవర్తి యొక్క ఒక్కతే కూతురు. యువరాణి ప్రశాంతీ దేవి. ఆమెను నా దగ్గర తక్కువ చేసో, అమర్యాదగానో మాట్లాడకు. అలా కాదని మాట్లాడితే ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఇక మీదట నన్ను వెతుక్కుని ఇక్కడికి వచ్చి నిలబడకు

షాకై నిలబడ్డ స్నేహలత చీకటి పడింది. రోజు ఇక్కడ ఉండిపోయి ప్రొద్దున్నే వెళ్దామని... చెప్పాలనుకున్నది ---కానీ అతని కళ్ళల్లోని అగ్ని కణ చూపులను చూసి, మధ్యలోనే ఆపేసింది. తరువాత వొణుకుతూ వెళ్ళిపోయింది.

నేను చేసిన పిచ్చి పనివలన నాకూ, శ్రీనివాస్ కూ పెళ్ళి అనేది కలగానే మిగిలిపోతుంది లాగుందే!అని అవేదన చెందింది స్నేహలత.

అవునే, నువ్వు చేసిన పనులన్నీ తెలిస్తే... శ్రీనివాస్ నిన్ను వూరికే వదలడు. ఎంతవరకు చేయగలవో, అంతవరకు చేసి, శ్రీనివాస్ ని అంతే త్వరగా పెళ్ళి చేసుకో. ఆస్తులను నీ పేరుకు మార్చుకో. తరువాత అన్నిటినీ అమ్మేసి, విదేశాలలో  సెటిల్ అయిపోవాలి. దానికి ఇంకా ఏం చేయాలిఅని ఆమె మనసు కుట్ర పధకాన్ని గీసి ఇచ్చింది.

అదే సమయం ప్రశాంతి యొక్క ఫోటోను తీసుకుని పరుపు మీద పడిపోయి ఆ ఫోటోను చూస్తూ శ్రీనివాస్ గొణుగుతున్నాడు.

నన్ను మన్నించు ప్రశాంతి. నిన్ను నేను చాలా కష్ట పరిచాను. ఇంకోసారి నాకు ఛాన్స్ ఇవ్వమ్మా ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్

కళ్ళల్లో నీళ్ళతో ఫోటోలోని ఆమె ముఖంలో ఒక్కచోటును కూడా విడిచిపెట్టకుండా ముద్దులు పెట్టసాగాడు.

వదిలేయండి శ్రీనివాస్, గడ్డం గీసుకోకుండా...చూడండి, గడ్డం గుచ్చుకుంటోందీ -- ప్రశాంతి ముడుచుకుపోయింది. చేతులను వంచి అతని మెడ చుట్టూ వేయడానికి ప్రయత్నించింది. తానున్నది ప్రశాంతి నిలయంలో నన్న విషయం అర్ధం కావటానికే ఆమెకు కొంచం సమయం పట్టింది. ఎంత సుఖమైన కల. తమ హైదరాబాద్ ఇంటి పడక గదిలో శ్రీనివాస్ తన మొహంతో ఆమె మొహాన్ని ఎరుపెక్కిస్తున్నాడు.   

నవ్వుతూనే తన స్నానాల గదిలోకి మొహం కడుక్కోవటానికి వెళ్ళింది. ఎదురుగా కనబడుతున్న అద్దంలో చూసుకుంది. షాకయ్యింది. ఎందుకంటే, అందులో కనిపించింది ఆమె శరీరంతో ఉన్న వేరే స్త్రీ ముఖం.

గుండ్రని మొహం. అనిగిపోయున్న ముక్కు. నలుపు చాయలో ఉన్నా కళగా ఉన్న ముఖం. ఆమెను క్షుణ్ణంగా చూసింది.

ఇంకా నిద్ర మత్తు పోలేదా?’ అని అనుకుని కళ్ళపై వేగంగా నీరు కొట్టుకుని అద్దంలోకి మళ్ళీ చూడగా -- ఇప్పుడు క్లియర్ గా ఆమె మొహమే తెలిసింది.

కానీ, ఎవరో ఒకరు గబగబ వేగంగా వెళ్తున్నట్టు కదలిక తెలియగా, వెనక్కి తిరిగి చూసింది. అద్దంలో కనబడిన ఆమె ప్రతిభింబం ఒక క్షణం గడిచిన తరువాతే మెల్లగా తిరిగింది.

ప్రశాంతి, అది తెలిసుకోలేకపోయింది!

************************************************PART-14*********************************************

ఇంట్లో ఏం జరుగుతోంది?’ అనేది ప్రశాంతికి అర్ధం కాలేదు. మేడ మీద నుండి దిగుతున్న ప్రశాంతిని పట్టించుకోకుండా ఆమెను పక్కకు తోసేసి గాలిలాగా పరిగెత్తాడు ఒక కుర్రాడు. తనలో నుండి ఏదో దూరి వెళ్ళినట్లు ఫీలయ్యింది ప్రశాంతి. తన పిల్లలు కింద మొదటి గదిలో ఉన్నారనేది ఆమెకు తెలుసు.     

ఇంకోక సారి స్నేహలత చేసిన చెడు పనులను గురించి ప్రశాంతి ఆలొచిస్తున్నప్పుడు. డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టున్న ప్లేట్లు ఒక్కొక్కటిగా క్రింద పడి విరిగున్నాయి. ఏదో పిల్లి తోసేసుంటుందని అనుకుని మళ్ళీ తన జ్ఞాపకాలలోకి వెళ్తూనే డైనింగ్ టేబుల్ వైపు చూసిన ప్రశాంతి, ఏదో మ్యాజిక్ లాగా -- గాలిలోకి ఎగిరిన ప్లేట్, ఎవరో వేగంగా విసిరి వేస్తున్నట్టు గోడకు తగిలి విరిగింది చూసి ఆశ్చర్యపోయింది. 

రోజు అలాగే మేడపై కూర్చుని ప్రశాంతి వేడుక చూస్తున్నప్పుడు, రాజులాగా ధుస్తులు ధరించిన, పదిహేడేళ్ళు ఉన్న ఒకతను రాజ శభలో నడుస్తున్నట్టు ఇల్లంతా చుడుతూ నడుస్తున్నాడు.

ఇతనే గిరిజను భయపెట్టి ఉంటాడులాగుంది. వీడికి అలా ఏం కావాలి? తనని భయపెట్టి ఇక్కడ్నుంచి ఎవరైనా తరమటానికి ప్రయత్నిస్తున్నారో?’

వేగంగా క్రిందకు వెళ్ళి --  వాడు వెళ్ళిన దిక్కు వైపు నడిచింది. బాట తీసుకు వెళ్ళిన చోటు చింత చెట్టు వెనుక ఎవరూ గమనించలేని పాడుబడ్డ శ్మశానం!

మొట్టమొదటి సారిగా ప్రశాంతికి ఒక భయం ఏర్పడింది.  

శ్రీనివాస్ కు ప్రశాంతిని, పిల్లల్నీ తలచుకుంటుంటే మనసు నొప్పి పుడుతోంది.  అతనికి మామగారు రాజా మార్తాండ చక్రవర్తిని చూడటానికి ఇష్టం లేకపోవటానికి కారణం, ఆయన తన అత్తను బలవంత పెట్టి పెళ్ళి చేసుకున్నాడని నమ్మటమే. అలా పెళ్ళి చేసుకున్న అత్తయ్య ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టు అతనికి అనిపించలేదు. మార్తాండ చక్రవర్తి గారు తరువాత శ్రీనివాస్ కుటుంబానికి ఎంతో మంచి చేసున్నా, శ్రీనివాస్ వల్ల చక్రవర్తి గారిని క్షమించటానికి మనసు రాలేదు.

ప్రశాంతి, శ్రీనివాస్ ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలుసుకున్న ఒక రోజు మార్తాండ చక్రవర్తి స్నేహితుడు రహీం బాయ్ శ్రీనివాస్ ను కలుసుకోవటానికి వచ్చాడు. ఇద్దరూ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నారు.  స్నేహలత గురించి, ఆమె డబ్బు ఆశ గురించి చెప్పారు రహీం బాయ్. దానికి కొంచం ముందు శ్రీనివాస్ కు దొరికిన పోలీస్ రిపోర్ట్స్నేహలత గురించి రహీం బాయ్ చెప్పిన ప్రతి విషయమూ కరెక్ట్ అనేది తెలిపింది.   

బయలుదేరే ముందు ఆయన శ్రీనివాస్, ప్రశాంతి నాకూ కూతురు లాంటిదే. మీరు నాకూ అల్లుడే. మీ అత్తయ్యను చక్రవర్తి బలవంతపు పెళ్ళి చేసుకున్నారని ఎవరో నీతో చెప్పారని తెలుసుకున్నాను. అది నిజం కాదని చెప్పటానికే వచ్చాను. నిజం చెబుతా విను. పెళ్ళికి వెళ్ళిన చోట, ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడికి, మీ అత్తయ్య పండ్లు ఇవ్వటం చూశాడు చక్రవర్తి... క్షణమే చక్రవర్తికి మీ అత్తయ్య కుమారి పైన ఇష్టం ఏర్పడింది. 

కానీ, ఆమే పెళ్ళి కూతురు అని తెలుసుకుని తన మనసును అణుచుకున్నాడు. పెళ్ళికి ముందే పెళ్ళి కొడుక్కి పెద్ద ఉద్యోగం దొరికిందని చెప్పి అతని తల్లి-తండ్రులు ఇంకా ఎక్కువ కట్నం అడిగి గొడవ పడి దగ్గర దగ్గర పెళ్ళి ఆగిపోయింది. విషయం మీ అత్తయ్యకో, మిగిలిన వారికో తెలియదు.

మీ మావయ్య చక్రవర్తి వెంటనే కలుగజేసుకుని మగ పెళ్ళి వాళ్ళు పెట్టిన గొడవ గురించి బయటకు తెలిస్తే అందరూ నీ చెల్లి కుమారి నే తప్పుగా మాట్లాడతారు. అందుకని మగపెళ్ళి వాళ్ళు అడిగిన అదనపు కట్నం డబ్బును నీకు సహాయంగా ఇస్తాను, పెళ్ళి చెయ్యి అని మీ నాన్నకు చెప్పినప్పుడు,  “మగపెళ్ళి వాళ్ళు  విషయాన్ని ఈజీగా తీసుకుని ప్రతి విషయానికి నన్ను పీడించుకు తింటారు. అందువలన పెళ్ళి ఆగిపోనీ. ఇంకో సంబంధం చూసుకుందాం అని చక్రవర్తితో గట్టిగా చెప్పారు.   

అందరూ పెళ్ళి ఎందుకని ఆగిపోయిందని అడిగితే నేనే కారణం అని చెప్పాడు మీ నాన్న. అదే ముహూర్తానికి నా స్నేహితుడు చక్రవర్తిని ఇచ్చి నా చెల్లికి పెళ్ళి చేస్తాను అని చెప్పి మీ నాన్న కుమారిని చక్రవర్తికి ఇచ్చి పెళ్ళి చేశాడు. అందరూ మీ నాన్నను తిట్టారు, నిందించారు. మీ నాన్న అవేమీ పట్టించుకోలేదు. మీ అత్తయ్య కూడా మీ నాన్న చెప్పింది నమ్మలేదు. కానీ మీ నాన్న చెప్పాడు కదా అని చక్రవర్తిని పెళ్ళి చెసుకోవటానికి తలవంచింది మీ అత్తయ్య. 

కానీ మీ అత్తయ్య జీవించినంతవరకు ఒక మంచి భార్యగా జీవించలేదు. నా స్నేహితుడితో నలభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత కూడా మీ అత్తయ్య చక్రవర్తిని అర్ధం చేసుకోలేదు.

 నీ బిడ్డలను మోసి, స్నేహలతని నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఆపి, నీ జీవితం అదఃపాతాళానికి పడిపోకుండా నిన్ను కాపాడిన ప్రశాంతిని నువ్వూ అర్ధం చేసుకోలేదు.

మీ కుటుంబానికి మంచి చేసే చేసే, నా స్నేహితుడి కుటుంబం కష్ట పడింది.  ప్రశాంతికి ఉన్న మనసు, నాన్న లాంటి రూపం, గుణమూ మాత్రమే కాదు -- జీవితం కూడా అలాగే ఏర్పడింది -- అని బాధతో చెప్పి వెళ్ళినతని కళ్ళల్లో, నిండిన నీటిని చూశాడు.

ఇది ఆయన కొంచం ముందు వచ్చి చెప్పుంటే, నా ప్రశాంతిని ఇంటి నుండి వెళ్ళ నిచ్చేవాడిని కాదు?’ అని ఒక మనసు చెప్పగా, ‘నీ భార్యను నువ్వు నమ్మటానికి, ఇంకొకరు వచ్చి ఆధారాలు ఇవ్వాలా? ఇంతేనా నీ స్వభావం...?’ అని మరో మనసు క్షొభ పెట్టింది.

ప్రశాంతీ...నువ్వూ, పిల్లలూ ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు?’ అని తలచుకుంటూ పడుకున్నతను, అలాగే నిద్ర పోయాడు.

అతనికి అందమైన కల వచ్చింది. కలలో ఒక ఇల్లు. అందులో భార్యా, పిల్లలూ సంతోషంగా మేడమెట్లు ఎక్కి ఆడుకుంటున్నారు. అతనికి నచ్చిన పచ్చ రంగు చీర కట్టుకోనుంది ప్రశాంతి. ఇల్లు రాజ భవనం లాగా ఉన్నది.  

వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళో అతని చేతికి చిక్క కుండా పరిగెత్తుతున్నారు. ఇది చోటు, చోటు?’ అని బుర్ర వేడేక్కేలాగా ఆలొచించాడు. కలలో మెల్లగా ఒక స్వరం అతని చెవిలో గుసగుసలాడింది.

ఇది ప్రశాంతి నిలయం

గబుక్కున లేచాడు.

ప్రశాంతి నిలయం, ప్రశాంతి నిలయం...అవును! అతని భార్య యొక్క రాజ భవనం ఇల్లు. మరిచిపోలేని చోటు. ఇదంతా నిజమా? అలాగూ ఉంటుందా? లేదు...ఖచ్చితంగా అలాగే ఉంటుంది!

చేయాల్సిన పనులను వేగంగా చేశాడు. స్నేహలతకి సమాచారం పంపి మధురై కి రమ్మన్నాడు. ఒక నిర్ణయంతో కారు తీసుకుని బయలుదేరాడు.

మధురైలో స్నేహలతని కలిసిన అతను -- ఆమెను అక్కడ కాచుకోమని చెప్పి, ‘అర్జెంటు పనిఅని ఆమె దగ్గర అబద్దం చెప్పేసి----కోడైకానల్ రోడ్డులో వెళ్ళటం మొదలు పెట్టాడు.

************************************************PART-15*********************************************

ప్రశాంతి కి వ్యత్యాసమైన అనుభవం ఏర్పడింది.

రోజు రాత్రి పరుపు మీద బోర్ల పడుకుంది. ఎవరో గదిలోకి చొరబడుతున్నట్టు అనిపించింది. సన్నని స్వరంతో రెండు స్వరాలు వినబడినై. కానీ ఎవరూ కంటికి కనబడలేదు.

ఒక ఆడగొంతు ఏదో అస్పష్టంగా చెప్పింది. దానికి ఒక మగ గొంతు బాధ పడకు ఇల్లు మనది. ఇక్కడకొచ్చి మనల్ని కష్టపెడుతున్న వాళ్ళను మనం తరిమి కొట్టాలి

తరువాత ప్రశాంతి వీపు పైన ఏదో తగిలినట్లు అనిపించింది. మరుక్షణం చోట భరించలేని నొప్పి పుట్టడంతో కేకలు వేసింది.

ఎర్రగా కాలిన ఇనుప కడ్డీతో వాత పెట్టినట్టు ఉన్నది నొప్పి.

అప్పుడు వెనుక పక్క తలుపును తెరుచుకుని ఎవరో కొంతమంది బయటకు వెళుతున్న ఫీలింగ్. ఇంట్లో ఏదో ఒక అమానుష విషయం ఉన్నదిఅని ఖచ్చితంగా నమ్మటం మొదలు పెట్టింది.

వేగంగా కిందకు వచ్చింది. అంత చీకట్లోనూ తోట పని చేస్తున్నాడు వెంకటస్వామి. ఆయన పక్కన మేరీ నిలబడున్నది.

వెంకటస్వామీ, ఇంట్లో ఏదో మర్మ తిరుగుడ్లు ఉన్నాయి. నేనే చూశాను

ఇద్దరూ ఆమెను షాక్ తో చూడగా:

ఎవరో నా గదికి వచ్చారు. నా వీపు మీద బాగా కాలిన కడ్డీతో వాత పెట్టినట్లు ఉన్నది. ఇంకా మంట పుడుతోంది చూడండి

వెంకటస్వామి దగ్గర ప్రశాంతి తన వీపును చూపించ:  

అక్కడ ఒక రూపాయి నాణెం అంత సైజులో కాలిన గాయం ఉన్నది.

ఇంటికి పక్కన ఒక శ్మశానం ఉంది. అది నేనే చూసాను. మొదట్లో నాకు దయ్యాలూ-భూతాలూ పైన  నమ్మకం లేదు. ఇప్పుడు జరిగిన అనుభవాలు -- అదంతా నిజమనే చెబుతోంది. వెంకటస్వామీ రండి. పక్కన కాలీమాత గుడి ఒకటి ఉన్నదటగా! అక్కడికి వెళ్ళి పూజారిని పిలుచుకు వద్దాం

బాగా చీకటి పడిపోయిందమ్మా. రేపు వెళదాం

వద్దు...నాకు ఇప్పుడే వెళ్ళాలి. మీరు రాకపోయినా నేను వెళ్ళి పుజారిని పిలుచుకు వస్తాను

వెనక్కి తిరిగి నడవటం మొదలు పెట్టింది.

చుట్టూ పొగలాగా కమ్ముకోనున్న బాటలో నడుస్తుంటే మేఘాల గుంపులో తేలుతున్నట్టు అనిపించింది. చిన్న బాటలో వాకిట్లో ఉన్న ఇనుప గేటు వైపుకు నడిచిన ఆమె, ‘క్రీచ్అనే శబ్ధంతో గేటును తెరుచుకుని వచ్చినతన్ని చూసి ఆశ్చర్యపోయింది.

గేటును పుచ్చుకుని ఆమెనే చూస్తూ నిలబడ్డాడు ఆమె ప్రియమైన భర్త శ్రీనివాస్. అతని చేతుల్లోకి వెళ్ళిపోదామా అని ఆమె మనసు గెంతుతున్నా, ఏదో అడ్డుపడ -గుడికి వెళ్ళాలనుకున్న ఆలొచనను మానుకుని  ఇంటి వైపుకు నడవటం మొదలుపెట్టింది. మెల్లగా జరిగి తన పక్కకు వచ్చిన అతని దగ్గర నుండి బ్రాందీ వాసన----

అతను తన స్పృహలో లేడుఅని తెలిపింది.

ప్రశాంతీ! నువ్వు ఇక్కడే ఉన్నావాసారీ...సారీ...నన్ను వొంటరిగా వదిలేసి వెళ్ళటానికి నీకు ఎలా మనసొచ్చింది?”

ఇంటి వైపుకు నడుస్తున్న ఆమెను, తూలుకుంటూనే ఆమె వెనుకే నడిచాడు. కష్టపడి గదిలోకి వచ్చినతను, అంతకంటే నడవలేక 'దబ్' అని బెడ్ మీద పడ్డాడు. నాన్నను ఆశగా చూడటానికి వచ్చిన పిల్లల్ని ఆపుతూ----

నాన్న టయర్డుగా ఉండటంతో పడుకున్నారు. రేపు ప్రొద్దున చూద్దాం అని చెప్పి పంపించింది.

అతను తాగున్నది పిల్లలకు తెలియకూడదనేది ఆమె ఆలొచన

ప్రశాంతీ! నాకు నువ్వూ, పిల్లలూ కావాలి. స్నేహలత వద్దు. నిన్ను శిక్షిస్తున్నా అనుకుని, నన్ను నేనే శిక్షించుకున్నాను. క్షమించు. ఇక మీదట నీ గురించి తప్పుగా మాట్లాడను. తప్పుగా ఆలొచించను. నన్ను శిక్షించింది చాలు.

రా, మధ్యలో జరిగింది మర్చిపో...మనం కుటుంబంతో సహా సంతోషంగా ఉందాం---రాత్రంతా ఇలాగే కలవరిస్తున్న అతన్ని చూస్తూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది.

అదే సమయం తోటలో కూర్చోనున్న పనివాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

వెళ్ళి పూజారిని పిలుచుకు వస్తాను అని చెప్పిన వెంటనే నాకు లాగిపెట్టి ఒకటిచ్చినట్టు అనిపించింది. మంచికాలం...ఆమె భర్త రావటం వలన మనం తప్పించుకున్నాం

వెంకటస్వామి చెబుతుంటే, అందరూ వింటూ ఉన్నారు.

మనం వచ్చిన పనిని ఎప్పుడు ముగించేది? సమయం పోతూనే ఉన్నదే?” అన్నది మల్లి.

అమ్మను చూస్తే పాపం అనిపిస్తోంది. మనం ఇది చెయ్యాలా?” అన్నది సరసు.

పాప-పుణ్యాలు చూడటానికి మనమేమన్నా మనుషులమా? మనం చెయ్యలేకపోతే ఇంట్లో ఉన్న ఇంకెవరైనా పని చేస్తారు. అది ప్రశాంతికి మరింత కష్టంగా ఉంటుంది అన్నది మేరీ.

అమ్మాయిని చూస్తుంటే కొంచం కష్టంగానే ఉంది...సరే పని ముగించటానికి రోజు ఖాయం చేశారా?” అన్న సరసుకు జవాబుగా-------

అవును...సమయం, కాలమూ కలిసొచ్చింది. మనం చేయబోయేది పూర్తి అమావాస్య రోజున. అంటే రేపు అన్నాడు వెంకటస్వామి.

వెంకటస్వామీ, రేపటి వరకు మనం దొరకకుండా ఉండాలా? అయితే, ముందున్న సమాధులను అన్నింటిని ఆకులు వేసి జాగ్రత్తగా మూయండి" అన్నది మేరీ.

ఊహు...వద్దు. విసుకున్న వెంకటస్వామి, అక్కడ కుప్పగా పడున్న ఎండిపోయిన ఆకులను చూశాడు. అప్పుడు హఠాత్తుగా వీచిన గాలి ఆకుల గుంపును తీసుకు వెళ్ళి బయటకు తెలుస్తున్న సమాధులను అందంగా కప్పింది.

సమాధులలో ఒకదాని మీద మేరీ జాన్ -- జననం-మరణంఅని సరిగ్గా కనబడని అక్షరాలు కనబడింది.

తరువాత చోటే శ్మశాన నిశ్శబ్ధంతో నిండింది

************************************************PART-16*********************************************

ప్రొద్దున శ్రీనివాస్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అతని దగ్గర మాట్లాడాలని అనుకుంది ప్రశాంతి. అది ఆమెకు చాలా మానసిక కష్టాన్ని ఇచ్చింది. పిల్లలు నాన్న ఎక్కడ?’ అనే అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక వాళ్ళను రెండు తిట్లు తిట్టి ఆడుకోవటానికి పంపించింది.

ఆమెకు మనసు కష్టంగా ఉండటంతో, లైబ్రరరీకి వెళ్ళి బుక్స్ అలమరాను కెలకటం మొదలు పెట్టింది. ఎంత సమయం పట్టిందో ఆమెకే తెలియదు. అక్కడున్న పాత పేపర్లు ఆమెను ఆకర్షించ...ఒక్కొక్కటీ తీసి, అందులో ఒక్కొక పేజీనూ తిప్పి చూడటం మొదలుపెట్టింది.

ఒక పెద్ద భూకంపమే అందులో దాగున్నదని ఆమెకు తెలియదు!

పాత న్యూస్ పేపర్ లోని నాలుగో పేజీలో ఉన్న ఒక వార్త ఆమెను ఆందోళనకు గురిచేసింది. వెళ్ళకావియల్ నుండి కొంచం క్రింద, కరెక్టుగా చెప్పాలంటే ప్రశాంతి నిలయానికి వెనుక వైపు జరిగిన కొండచరియల విరుగుబాటలో నలుగురు మరణించారు. వాళ్ళ ఫోటోలు, దాని కింద పేరు, పాత న్యూస్ పేపర్ కాగితంలో ప్రింట్ అయ్యుంది.

వాటి వివరాలు:

1. శ్రిమతి మేరీ జాన్. వయసు యాభై ఎనిమిది, నర్స్.

2. వెంకటస్వామి, వయసు అరవై ఐదు -- సెక్యూరిటీ.

3. సరసు, వయసు ముపై మూడు.

4. మల్లి, వయసు ఇరవై ఎనిమిది.

హాస్పిటల్ నుండి ఎవరో ఒక గ్రామ మహిళకు ప్రసవం చూడటానికి వెళ్ళిన మేరీ, ఆమెకు తోడుగా వెళ్ళిన వెంకటస్వామి, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న సరసు, మల్లి అనుకోకుండా కొండ చెరియ విరిగి పడిన చోట అప్పటి  కప్పుడే మరణించారు.

---- వార్తను చదివిన ప్రశాంతి షాక్ లో ఉండిపోయింది.

ఇన్ని రోజులు నేను సన్నిహితంగా ఉన్నది మనుష్యులతో కాదా?’

తన పిల్లలు జ్ఞాపకానికి రాగా, క్రిందనే ఒక మారు మూల ఉన్న లైబ్రరీ వదిలిపెట్టి పెనుగాలిలాగా బయటకు వచ్చింది.

గిరిజా, రాఘవా...ఎక్కడున్నారు?” అని అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమె, ఇంట్లో ఏదో ఒక వ్యత్యాసమైన పరిస్థితి ఉండటాన్ని తెలుసుకోలేదు.

ఇంటి బయట పొగమంచు నాలుగు వైపులా నేల కూడా కనబడకుండా మూసుకుపోయింది. అమావాస్య చీకటి సాయంత్రం, అప్పుడే ప్రారంభమయ్యింది. దాంతో పాటూ త్వరలో వర్షం రావడానికికైన సూచనలుగా మెరుపులు మెరిసి కనబడకుండా పోతున్నాయి.

పెల పెల మని ఊడిపోయి పడిపోయిన ఆకులను తొక్కు కుంటూ వస్తున్న శబ్ధం విని వెనక్కి తిరిగింది.

ఆమె వైపుకు వస్తున్నారు మేరీ, వెంకటస్వామి, సరసు, మల్లి అనే ఆ నలుగురూ!

తన చేతిలో దొరికిన దాన్ని వాళ్ళపై ఎగరేస్తూ ఎవరు మీరు? ఎందుకు నన్నూ, నా పిల్లలనూ కష్టాలు పెడుతున్నారు? మమ్మల్ని వదిలి వెళ్ళిపొండి అని అరుస్తూ ఇంటిలోపలకు దూరి, తలుపు వేసుకుంది.

కుంబవృష్టిగా కురుస్తున్న వర్షంతో పాటూ వీస్తున్న గాలి ప్రదేశాన్నే కదిలిస్తోంది.

పరిగెత్తి వంట గదిలోకి వెళ్ళిన ఆమె -- కత్తి ఏదైనా ఉన్నదాని వెతుకగా.,

తాళం వేసున్న తలుపులను తోసుకుంటూ లోపలకు వచ్చారు నలుగురూ.

నవ్వుతూ చెప్పాడు వెంకటస్వామి.

ఏమిటి ప్రశాంతీ....కత్తిని వెతుకుతున్నావా? పది సంవత్సరాల క్రితమే చనిపోయిన మమ్మల్ని కత్తితో చంపాలనుకుంటున్న నువ్వు తెలివిగల దానివా...లేక మూర్ఖురాలివా?”

చెప్పండి...ఎక్కడ నా పిల్లలు? ఏం చేశారు నా పిల్లలను?” అని అతి గట్టిగా కేకలేసింది.

ఏం చేశామా? మేము ఏమీ చెయ్యలేదు...చెయ్యం కూడా. కానీ, వాళ్ళ దగ్గర నుండి నీ పిల్లలను కాపాడటం నీ వల్ల మాత్రమే అవుతుంది. అందుకు ఇదే సరైన సమయం. పో...పోయి కాపాడు అన్నది మేరీ.

అమ్మా...

మేడమీద తమ గదిలో నుండి పిల్లల అరుపులు

కేకలు వేస్తూనే వేగంగా మెట్ల మీద ఎగురుకుంటూ వెళ్ళింది.

అక్కడ...

మేడమీద ఆమె ఉండే గదిలో నలుగురైదుగురు ఉన్నారు. ప్రశాంతి వయసులో ఒక స్త్రీ, ఆమె రోజు స్నానాల గదిలోని అద్దంలో చూసిన మొహం. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉన్న ఒక మగాడు. అతడు ఆమెకు బాగా పరిచయమున్న మనిషి.

అవును! గుర్తుకు వచ్చింది. ప్రశాంతి నిలయాన్ని చాలా రోజులుగా తనకి అమ్మమని అడుగుతుండే వాడు. అతని ఇంకో చేయి పుచ్చుకున్నది కుర్రాడు.

పైన ఇద్దరు గూండాలు. అందులో ఒకడు పూజారి లాగా డ్రస్సు వేసుకుని ఉన్నాడు. ముగ్గువేసి, దాని చుట్టూ పువ్వులు. ఒక కోడి బలి ఇవ్వబడింది. మంత్రాలను ఉచ్చరిస్తున్న మనిషి ఎదురుగా పిండితో చేయబడ్డ మూడు బొమ్మలు. ఒకటి పెద్దది, రెండు చిన్నవి.

తల్లిని కట్టిన తాడు విడిపోబోతోంది. అది పూర్తిగా ఊడిపోయేలోపు, చిన్న వాళ్ళ ఇద్దరినీ అనిచేద్దాం. తరువాత వాళ్ళను చూపించి బెదిరించి తల్లిని ఒక ఆట ఆడిద్దాం అని చెబుతూనే, దగ్గరగా ఉన్న సూదిని తీసి బొమ్మలపైన గుచ్చాడు మంత్రవాది.

అమ్మా, నొప్పి పుడుతోందమ్మా అని అరిచిన తన పిల్లలను చూసి ఆవేశ కచ్చె పుట్టి, “ఏయ్...ఎంత ధైర్యం రా నీకు? నా పిల్లలను కట్టిపడాశావు అంటూనే సుడిగాలిలా తిరిగింది ప్రశాంతి.

అక్కడున్న పూజ సామాన్లు, పువ్వులూ చక్రంలా తిరిగి, తిరిగి ఒక మూలకు ఒకటిగా ఎగిరినై. దీన్ని ఎదురు చూడని వాళ్ళందరూ భయంతో చెరో పక్కకు పరిగెత్తేరు.

ఎక్కడ్నుంచి ఆమెకు అంత బలం వచ్చిందో తెలియలేదు!

నీ బలం తెలియక నీతో పెట్టుకున్నాం. మమ్మల్ని వదిలేయ్. ఇక మీదట నీ దారికే రాము”…. ప్రశాంతి అతని గొంతు పట్టుకు నొక్కుతుండగ, ఆమెను విడిపించుకోలేక, గాలిపీల్చుకోలేక ఆయస పడుతూ చెప్పాడు మంత్రవాది.

ఇక మీదట ఇలాంటి తప్పుడు పనులు చేయటానికి ప్రశాంతి నిలయం పక్కకు వచ్చావో... తరువాత నీ శరీరంలో నుండి ప్రాణం తీసేస్తాను

రాణిలాగా మారి కింది గొంతులోంచి ఉరుమింది ప్రశాంతి.

రానే రాను తల్లీ! నేను మాత్రమే కాదు...మా మనుషులు కూడా ఇంటి లోపలకే చొరబడరు. ఇది ప్రామిస్...ప్రామిస్...ప్రామిస్

నేల మీద మూడుసార్లు కొడుతూ సత్యం చేసినతను వణికిపోతూ పారిపోయాడు.

జరిగిన వాటికంతా కారణం ప్రశాంతికి తెలిసిపోయింది.

ఇప్పుడు ఆమె మొహంలో ఉన్న కోపం, చీకటి కనుమరుగయ్యింది.

ప్రకాసవంతమైన కాంతితో చోటే ఒక ఇంద్ర భవనంలా కనబడింది.

************************************************PART-17*********************************************

అమావాస్య రాత్రి ప్రారంభమైన రోజు, కోడైకానల్ హెయర్ పిన్ బెండు లో తేలికగా కారు నడుపుకుంటూ వచ్చాడు శ్రీనివాస్.

హఠాత్తుగా కుంభవృష్టి మొదలైయ్యింది.

దగ్గరగా స్నేహలత కూర్చోనుంది.

శ్రీనివాస్ ఆమెను పెళ్ళి చేసుకుంటానని రెండు రోజుల క్రితం చెప్పటంతో, ఆమె చాలా ఆనందంలో ఉంది. మొదట కోడైకానల్ లో హనీ మూన్. తరువాత పెళ్ళి అని చెప్పటంతో ఆమెకు అది నచ్చింది.

మధురై నుండి ఒక పత్రికా విలేఖరి ఒకరికి ఇంకెవరో మాట్లాడుతున్నట్టు ఫోన్ చేసి... శ్రీనివాస్, తనూ ఒంటరిగా బయలుదేరి వస్తున్నట్టు చెప్పుంచింది. ఎవరైనా చూడాలనే కారణంగా శ్రీనివాస్ తో బాగా క్లోస్ గా ఉన్నట్టు నటించింది.

అతని ఆస్తి మొత్త వివరం తెలిసున్న ఆమెకు మనసులో కొంత ఉత్సాహంగా ఉన్నది. మొదటి పనిగా ఆస్తులన్నిటినీ తన పేరుకు మార్చాలని అనుకుని, దానికైన పధకమూ వేసింది.  

కానీ, పరిస్థితిని బట్టి, మొహాన్ని కొంచం శోకంగానే పెట్టుకుంది. అన్నీ కలిసి వచ్చేటప్పుడు శ్రీనివాస్ కు ఎటువంటి అనుమానమూ రాకూడదుఅనే విషయంలో హెచ్చరికగానే ఉన్నది.

స్నేహలతా, నాలో ఉన్న కొన్ని అనుమానాలకు జవాబు కావాలి -- అని నిదానంగా చెప్పాడు శ్రీనివాస్.

స్వరం ఏదో ఒకటి జరగబోతోంది అనే వార్నింగ్ సమాచారం అనేది గ్రహించింది.

ప్రశాంతి ఇంటి నుండి వచ్చే రోజు ఏం జరిగింది?”

కారును ఒక పక్కగా ఆపి అడిగాడు.

మేలుకుంది స్నేహలత.

నాకెలా తెలుసు?”

నిజంగానే నీకు తెలియదా?”

అతని స్వరం మరికొంత కఠినమైంది.

తెలియదు ఖచ్చితంగా చెప్పింది.

నిజంగానే నీకు తెలియదు?”

అతని మాటల్లో వేడి తెలుస్తోంది.

నిజంగానే తెలి...

చెంప మీద తగిలిన దెబ్బ కారణంగా స్నేహలత యొక్క చెవిలో గుయ్అని శబ్ధం వచ్చింది.

జేబులో ఉన్న తుపాకీని మెల్లగా తీసాడు.

నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు స్నేహలతా? తుపాకీనా లేక కత్తా?”

ఆమె కళ్ళల్లో మరణ భయం కనబడింది.

నిజం చెప్పేస్తాను. కోడైకానల్ కు వస్తున్న ప్రశాంతి కారును దారిలోనే అడ్డగించి, ఆమెను బెదిరించి, విడాకుల కాగితాల్లో సంతకాలు మాత్రమే తీసుకోమన్నాను. కానీ, రౌడీలు ఇంకేదో చెయ్యటానికి ప్రయత్నించారనుకుంటా. ఆమె, కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి దారి కనబడక కొండపై నుండి లోయలోకి పడిపోయి చచ్చిపోయింది. అందులో నా తప్పేమీ లేదు

ఛీ ఛీ...నువ్వు ఒక అమ్మాయివేనా? మనిద్దరం ఇచ్చిన ట్రబుల్ తట్టుకోలేక, ఆరోగ్యం బాగుండని నా పిల్లలను తీసుకుని ఎవరికీ తెలియని చోటుకు పరిగెత్తుకు వచ్చిన ఆమెను -- రౌడీలను పెట్టి భయపెట్టావు.

ప్రశాంతి భయపడిపోయి -- అలవాటులేని చోట, తప్పించుకోవటానికి వేగంగా కారు నడిపి, బెంబేలు పడి అదః పాతాళంలో పిల్లలతో పాటూ పడిపోయింది.  

ప్రశాంతిని హత్య చేసేసి...కొంచం కూడా నేర భావనే లేకుండా ఆమె భర్తనీ, ఆస్తిని అనుభవించటానికి ఆశపడిన నీకు ఏం శిక్షో తెలుసా...?”

“...................”

నేను పెళ్ళికి అంగీకరించకపోతే నన్ను చంపేస్తానని బెదిరించావని పోలీసుల దగ్గర నీ మీద ఒక కంప్లైంట్ రాసిచ్చే వచ్చాను. ఇప్పుడు నాకేదైనా అయితే నువ్వు తప్పించుకోలేవు. కానీ నీ క్రిమినల్ బుర్ర గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తప్పించుకోవటానికి ఏదైనా చేస్తావుఅందుకనే నువ్వు చేసిన తప్పులకు నేనే నీకు శిక్ష వేయాలని నిర్ణయించుకుని, నిన్ను నాతో పాటూ తీసుకు వచ్చాను...దిగు, కారొలో నుంచి దిగవే... అని చెబుతూనే కారులో ఉన్న స్నేహలతని కిందకు తొశాడు.

స్నేహలత రోడ్డు మీద పడింది.

వెంటనే రోడ్డు మీద పడిన ఆమె కాళ్ళ మీద వేగంగా కారును ఎక్కించాడు.

రెండు కాళ్ళూ కారు చక్రాల క్రింద పడి చితికిపోగా........

అమ్మా... అంటూ కేకలేసింది స్నేహలత.

నీకిప్పుడు నొప్పి పుట్టినట్లే కదా...అమాయకులైన నా చిన్న పిల్లలిద్దరికీ నొప్పి పుట్టుంటుంది? అందుకని నువ్వు త్వరగా చావకూడదు. చేసిన తప్పును తలుచుకుంటూ జీవితాంతం కాళ్ళు లేకుండా, నీ పనులు నువ్వు చేసుకోలేక జీవించాలి. అందుకే నీకీ శిక్ష.

నేనూ, నా భార్యా-పిల్లల దగ్గరకు వెడతాను. జీవితంలో దేవుడిచ్చిన స్వర్గాన్ని  పారేసుకుని నిలబడ్డ మగవాళ్ళకు నా కథ ఒక పాఠం కావాలి

గిలగిలా కొట్టుకుంటున్న స్నేహలత వైపు కోపంగా చూస్తూ ప్లీజ్...ఇక్కడే చచ్చిపోయి -- నేను వెళ్తున్న చోటుకు వచ్చి నాకు ట్రబుల్ ఇవ్వకు

కారులో వెనక్కి వెళ్ళిన అతను, పదిరెట్లు వేగంతో హెయర్ పిన్ బెండ్ వైపు కారును వేగంగా నడిపాడు.

ప్రశాంతి పిల్లలతోటి కారులోంచి కింద పడిపోయిన అదే చోట,

శ్రీనివాస్ కారు కింద పడి...విరిగి ముక్కలయ్యింది.

ప్రశాంతి నిలయం నుండి కొంచం దూరంలో కిందపడి విరిగి పోయిన కారును చూసి ప్రశాంతికి వొణుకు పుట్టింది.

ఆమెకు ఇరువైపులా రాఘవ్గిరిజ ఉండగా---------

ఎదురుగా మేరీ, వెంకటస్వామి, సరసు, మల్లి .

ఇదేలాగానే మేము వచ్చిన కారు కొండపై నుండి కింద పడి పోయంది. కొంచం తట్టుకోలేని నొప్పి పుట్టింది. తరువాత ఏమి జరిగిందనేదే తెలియలా! కళ్ళు తెరిచి చూసినప్పుడు, నా పక్కన నా పిల్లలిద్దరూ ఉన్నారు.

దేవుడు మమ్మల్ని కాపాడేడని చాలా సంతోష పడ్డాను. కంటికి ప్రశాంతి నిలయం ఇల్లు తప్ప ఇంకేదీ కనబడలేదు. మేము ముగ్గరమూ ఇక్కడికి వచ్చాము. తరువాత మిమ్మల్ని చూశాము  అన్నది ప్రశాంతి.

ప్రేమగా ఆమె దగ్గరకు వచ్చిన మేరీ మేమూ కొండ చెరియ జారుడు వలన ఒకే రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూడటానికి వచ్చాము. కానీ, నువ్వు ప్రాణాలతో లేవని నీకు తెలియలేదు. ఇది మామూలే. చాలా మంది తాము చనిపొయామని తెలియక మామూలుగా చేసే పనులు చేస్తారు.

వాళ్ళ మనో పరిస్థితిని బట్టే వాళ్ళకు జరిగింది గురించి వాళ్ళకు తెలియవస్తుంది. మనల్ని మూసేసున్న మాయ అనే కట్టు, కొంచం కొంచంగానే మనల్ని వదిలి వెడుతుంది.

నీకు నిదానంగా చెబుదామని మేమూ కాచుకోనున్నాము. ఇంతలో ఇల్లు కొనడానికి వచ్చిన వాళ్ళ రాకపోకలు ఎక్కువ అయిపోయింది.

మీ కారు కింద పడిపోయిన వెంటనే, వారసులు లేని ఈ ఆస్తులను, ఆక్రమించుకోవటానికి కుటుంబంతో సహా వచ్చాసారు వాళ్ళు.   

కొన్ని సమయాలలో మనుషులు మనలాంటి ఆత్మలకంటే కృరమైన వాళ్ళు. వాళ్ళింటి అబ్బాయి రామూకు న్యాచురల్ గానే ఆత్మలను చూసే శక్తి ఉంది. కొంతమందికి అలాగే ఉంటుంది. మనల్ని చూడటం, మనతో మాట్లాడటం, అవసరమైతే మనల్ని నొక్కి గుప్పెట్లో పెట్టుకోవటం కూడా కుదురుతుంది. భవిష్యత్తులో ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి గలవాడుగా ఎదుగుతాడు.

అలాంటి అపూర్వ శక్తి ఉండటం వలనే ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ తెలిసి కూడా, చిన్న కుర్రాడైనా  ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని తల్లి-తండ్రులను తొందర పరచలేదు. కానీ, వాళ్ళమ్మా-నాన్నకు శక్తి తక్కువగా ఉన్నందువలన, వాళ్ళ వలన మనల్ని గుర్తించలేకపోయారు. కానీ, ఇక్కడ ఏదో జరుగుతున్నదని గ్రహించినా వారసులే లేని, కోట్లు విలువ చేసే ఈ బంగళాను విడిచి వెళ్ళటానికి ఇష్టపడక, ఆక్రమించుకోవటానికి మంత్రవాదిని తీసుకు వచ్చారు.   

మీరు ముగ్గురూ ఇక్కడ ఉన్నారని మంత్రవాది గుర్తించాడు. మిమ్మల్ని అణగదొక్కాలని మంత్రవాది పూజ ఏర్పాటు చేశాడు. రోజు నీ వీపు వెనుక ఏదో వాత పెట్టినట్టు ఉన్నదని చెప్పావు కదా?

అది ఇంకేదీ కాదమ్మా. వాళ్ళు వేసుకున్న దేవుడి లాకెట్టు. అది నీ మీద తగిలి నిన్ను నిప్పులాగా కాల్చింది. నువ్వు దాన్ని తెలుసుకోలేకపోయావు. కానీ, రోజు నువ్వు వేసిన కేకతో భయపడిపోయి, ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు మంత్రవాదిని పిలిచి నిన్ను కట్టి వేయటానికి ప్రయత్నించారు.

కానీ, మంత్రవాది పూజ మొదలుపెట్టటానికి మునుపే దాన్ని ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది. ఎందుకంటే...అకాల మరణం చెందినా ఇంకా శాంతియాగం ఉన్న ఆత్మవు నువ్వు.

నీకే మాకంటే వేగమూ, శక్తి ఎక్కువ. అందువలన అతని వలన నిన్ను ఎక్కువసేపు కట్టి ఉంచలేకపోయాడు. నిన్ను పెట్టుకుని వాళ్ళను తరిమేశాము. వాళ్ళ ఉనికి గిరిజకూ, నాకూ ముందే తెలిసింది.

అంతేకాదు...ఇక్కడ మనలాగా తిరుగుతున్న మిగిలిన వాళ్ళను కూడా గిరిజకు తెలియటం మొదలయ్యింది. ఎందుకంటే గిరిజ ఆడిన దాగుడుమూతల ఆటలో, ఆమెకు కళ్ళకు కట్టిన కట్టు తొందరగా ఉండిపోయింది. నీకు కొంచం  ఆలస్యమైంది

కానీ, నాకు ఏమీ అర్ధం కాలేదు! నేను మిగిలిన మనుష్యులలాగా వంటచేశాను, తిన్నాను...అన్ని పనులూ చేశానే?”

అది అలాగే. ఉయ్యాల అలవాటు కొన్ని సమయాలలో శ్మశానం దాటి వస్తుంది. నువ్వా వంట చేశావు? లేదు. సరసు వంట చేయలేదు. ఇక్కడ వంట చేసింది ఇంటిని కొనడానికి వచ్చి, తరువాత ఆక్రమించి ఇక్కడ బస చేసిన కుటుంబం. నువ్వు శుభ్రం చేసి వెళ్ళిన గదులను ఉపయోగించింది, రోజూ వంట చేసింది, రాఘవ్ బెడ్ మీద పడుకుని నిద్రపోయింది అన్నీ వాళ్ళే.

బాగా ఆలొచించి చూడు. రోజూ భోజనం చేసింది ఒక కలలాగానే ఉంటుంది. ఇకపోతే నువ్వు కరెక్టుగా కూర్చుని కడుపు నిండా భోజనం మీ ఇంట్లో వాళ్ళు పదో రోజు నీకొసం పెట్టిన పిండ భోజనమే. రోజే నీకు నిజమైన ఆకలి. అంతవరకు దాహం మాత్రమే

నాకూ, పిల్లలకూ మాత్రలు ఏవీ అవసరం లేకుండా ఆయసమూ, నా తలనొప్పి పోయింది దానివలనేనా? అయితే నేనూ, నా పిల్లలూ ప్రాణాలతో లేమా? నన్ను దయ్యం అనుకుని భయపడ్డ వారే నిజమైన మనుష్యులా?

నా శ్రీనివాస్ ను  వదిలి నేను నిజంగానే విడిపోయి చాలా దూరం వచ్చాశానా? ఆయన ఇంట్లో నా ఫోటోకి ముద్దు పెట్టినట్టు అనిపించింది, మాకు ఇష్టమైన వంటను అమ్మ ఏడుస్తూ వంటచేసినట్లు ఉన్నది, శ్రీనివాస్  భోజనం వద్దని చెప్పి ఏడ్చింది, నేను ఆయన చెంపల నుండి వస్తున్న కన్నీటిని తుడిచింది ఖచ్చితంగా నా కలకాదు.

అప్పుడు రోజు స్నేహలత  మీద ఉన్న కోపంతో చూసినప్పుడు ఒక్కొక్క ప్లేటు విరగటానికి కారణం నేనేనా? అమానుషమైన శక్తి నేనేనా? ”

ఆలొచించి చూసిన ప్రశాంతి, అన్నీ అర్ధమయినట్టు తెలుపడానికి తల ఊపింది.

అందరూ చిన్నగా నవ్వారు.

కాలం ఇంతే. మనం దేవుడ్ని చేరుకునేంత వరకు చోటు మనకు ఆశ్రయం. ఇక్కడకు మనలాంటి వారు చాలా మంది వస్తారు. కొంతమంది మన కంటికి కనబడతారు. కొందరు కనబడరు. వాళ్ళు ఇష్టపడినట్టు వాళ్ళ పనిని వాళ్ళను చేసుకోనిద్దాం. మనపని మనం చూసుకుందాం. సరేనా ప్రశాంతీ?”

నవ్వుతూ అడిగింది మల్లి.

నేనూ మీతో చేరిపోవచ్చా?” అనే స్వరం వినబడి అందరూ వెనక్కి తిరిగి చూశారు.

అక్కడ శ్రీనివాస్.

ప్రశాంతి అతనికి మొట్టమొదటగా కొనిచ్చిన బూడిద రంగు సూటు దుస్తులు వేసుకుని నిలబడున్నాడు.

ప్రశాంతీ...నేను తప్పు చేసేశాను. నువ్వూ, రాఘవ్--గిరిజ అందరూ నన్ను క్షమించాలి. నా వల్లే మీకు ఇంత కష్టం? నేను మాత్రం సరిగ్గా ఉండుంటే -- మనం ప్రాణాలతో -- శరీరంతో సంతోషంగా ఉండి ఉండవచ్చు.

నువ్వు ఇక్కడున్నావని నిన్న రాత్రి నేను ఇక్కడకు వచ్చినప్పుడే నేను పసిగట్టాను. కానీ, నేను నీ దగ్గరకు రావటానికి ముందు చెయ్య వలిసిన కొన్ని పనులూ, ఇవ్వవలసిన శిక్షలూ ఉన్నాయి. అన్నీ ముగించుకుని వచ్చాశాను. నేను ఇంకా రాముడ్నే ప్రశాంతీ. నా సీతను కష్టపెట్టినందుకు శిక్షగా ఇప్పుడే తగలబడ్డాను

అలాగంటే...ఇప్పుడు కింద పడిన కారులో నుండి....

ఏం చేయను? ప్రశాంతికి జీవిత భాగస్వామి అయినప్పుడు ప్రశాంతి నిలయానికే కదా రావాలి? నన్ను క్షమించి, నీతో ఉండనిచ్చి నన్ను ఏలుకుంటావా?”

తమ తండ్రి దగ్గరకు పరిగెత్తారు పిల్లలిద్దరూ.

ఆమె ఎలా మిమ్మల్ని ఏలుకోకుండా ఉంటుంది? ఆమె ప్రాణాలతో లేదనేది ఆమెకు తెలియకుండా పోయింది మీ జ్ఞాపకాల వలనే కదా అని మల్లి చెప్పగా.......

అక్కడ గలగల మంటూ నవ్వుల శబ్ధం లేచింది.

వెనుక ఉన్న చింత చెట్టూ ఆడుతూ-ఊగుతూ నవ్వుతో చేరిపోయింది.

దూరంగా నిలబడి ప్రశాంతి నిలయాన్ని చూస్తున్న మునీశ్వరుడి గుడి పూజారికి వొళ్ళంతా జలదరించింది.

రోజు రోజుకూ ఇంటిని చూడటానికి భయంగా ఉంది. ఎన్ని ఆత్మలు అక్కడికి ఆకలితో వచ్చి కాచుకోనున్నాయో?’ అని అనుకుంటూనే చేతులో ఉన్న పిండాలను ప్రశాంతి నిలయాని కి కొంచం దూరంలో ఉంచేసి, తిరిగి చూడకుండా వచ్చాశాడు.

అరిటాకున ఉన్న ఆహారాన్ని చూశారు. ఒక్కొక్కటీ కనబడకుండా పోవడం మొదలుపెట్టింది.

గుడికి తిరిగి వచ్చిన పూజారి దగ్గరకు అడవి పనులకు వెళ్ళి భయపడిపోయిన ఒక యుక్త వయసు స్త్రీని పిలిచుకు వచ్చారు.

మొహం పీక్కుపోయి ఏదో ఒక దిక్కుకు చూస్తున్న ఆమెను చూస్తూ డప్పు వాయించి అమ్మవారి స్తొత్రం ఆలపించాడు పూజారి.

మెల్లగా ఆకులు కదల....

క్షుణ్ణంగా చూస్తున్న చింత చెట్టూ తన వేగమైన ఆటను ప్రారంభించింది.

యుక్త వయసు స్త్రీలో మామూలు చూపు రావటం మొదలయ్యింది.

ప్రశాంతి నిలయం ప్రశాంతంగా మారింది.

************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)

శతమానం భవతి…(పూర్తి నవల)